-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
అమ్రాబాద్, ఏప్రిల్ 16: మండల పరిధిలోని ఈదులబావి గ్రామ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయైన విషాధ సంఘటన సోమవారం చోటుచేసుకుంది.
డిచ్పల్లి, ఏప్రిల్ 16: సాగునీటి వసతి మృగ్యంగా మారి కళ్లెదుటే పంట ఎండిపోవడాన్ని చూసిన ఓ యువరైతు, అప్పులు తీర్చే మార్గం కానరాక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన దర్పల్లి మండలం గోవింద్పల్లిలో సోమవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన డీ.రాకేష్(19) అనే యువకుడు తన తండ్రి సేద్యాన్ని పట్టించుకోకపోవడంతో తానే పంటలను సాగు చేస్తున్నాడు.
నల్లగొండ లీగల్, ఏప్రిల్ 16: నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన పుట్ట విష్ణువర్థన్రెడ్డి అదే గ్రామానికి చెందిన తన ప్రాణ స్నేహితుడు నల్లగొండ మున్సిపాల్టీ మాజీ కౌన్సిలర్ గుత్తా రాజేందర్రెడ్డిని హత్య చేసినట్లు నేరం రుజువైనందున విష్ణువర్థన్రెడ్డికి జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ మొదటి అదనపు జిల్లా జడ్జి సీపీ.విందేశ్వరి సోమవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలిలా ఉన్నాయి.
కర్నూలు, ఏప్రిల్ 16:కర్నూలు గ్రామీణ మండల పరిధిలోని దినె్నదేవరపాడులో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన అయిదుగురు సభ్యుల కుటుంబం సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బోయ చిన్న మద్దిలేటి అలియాస్ మధు(30) అతడి భార్య లంకేశ్వరి, ముగ్గురు పిల్లలు వౌనిక, వంశీ, చిట్టిలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.
బోనకల్, ఏప్రిల్ 16: మండల పరిధిలోని ముష్టికుంట్ల గ్రామంలో మసీదు నిర్మాణ స్ధలం వివాదం మరల మొదలైంది. నిర్మాణం గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా జరుగుతున్నాయని కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పటికి ఎటువంటి నిర్మాణాలు జరుపవద్దని హైకోర్టు తీర్పు ఉన్నప్పటికి మసీదు నిర్మాణం జరుగుతుందని సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రదేశానికి వెళ్లగా ఇరువర్గాల మధ్య ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న సంఘటన సోమవారం జరిగింది.
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 16: నగరంలోని దండివీధికి చెందిన గొర్లె చంద్రశేఖర్(45) అనుమానస్పదంగా మృతి చెందాడు. మృతుడు ఆదివారం రాత్రి 2గంటల వరకు ఇంటిలోనే ఉన్నాడని వేకువజామున 5గంటలకు చూసేసరికి ఇంటి సందులో విగతజీవిగా ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే పరిశీలించగా మృతిచెందినట్లు నిర్దారించారు. అయితే మృతికి గల కారణాలు తెలియరాలేదు.
విజయనగరం, ఏప్రిల్ 16: జిల్లాలోని పూసపాటిరేగ మండలానికి చెందిన దళిత యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. పూసపాటిరేగ ఎస్సీ కాలనీకి చెందిన ఆమె దివ్యాంగురాలు. తన పెద్దమ్మ ఇంటికి వెళ్లేందుకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆటొలో బయలుదేరి పట్టణంలోని కోట జంక్షన్ వద్దకు చేరుకుంది.
నెల్లిమర్ల, ఏప్రిల్ 16: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పశువా ఘటనా మరువకముందే జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో మరోధారుణం చోటుచేసుంది. సంఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. పీటీసీ దగ్గరిలోని ఓ పైవేటు లే-అవుట్లో ఈ సంఘటన జరగడం ధారుణం.
దేవరపల్లి, ఏప్రిల్ 16: అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు 34 లక్షల రూపాయల విలువైన గంజాయిని సోమవారం ట్రైనీ ఎస్పీ వై రిశాంత్రెడ్డి పట్టుకున్నారు.
రాజంపేట రూరల్, ఏప్రిల్ 16:మన్నూరు పోలీస్స్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్న ఎస్సై మహేష్నాయుడు సతీమణి సౌజన్య (24) సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకొంది. వివరాలిలావున్నాయి. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంకు చెందిన మహేష్నాయుడుకు నాలుగేళ్ల క్రితం నెల్లూరు కావలికి చెందిన సౌజన్యతో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు కలడు.