క్రైమ్/లీగల్

రైలు ఢీకొని విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 13: రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో ఓ విద్యార్థి దుర్మరణం పాలైన సంఘటన శుక్రవారం స్థానిక బీవీ నగర్ రైల్వేగేట్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని నవాబుపేటకు చెందిన చిరుకూరి నాగమనోజ్ కుమార్ ఇంటర్మీడియట్ పూర్తిచేసి నగరంలోని ఓ విద్యాసంస్థలో ఎంసెట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం తరగతులకు వెళ్లేందుకు హడావుడిగా రైల్వేట్రాక్ దాటుతూ ఎదురుగా వస్తున్న రైలును గమనించలేదు. దీంతో రైలు ఢీకొనింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనోజ్‌కుమార్ అక్కడికక్కడే మరణించాడు. ప్రమాద విషయం తెలుసుకున్న రైల్వే హెడ్‌కానిస్టేబుల్ జోసఫ్ విజయకుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.