S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/22/2018 - 00:12

కర్నూలు ఓల్డ్‌సిటీ, మే 21:చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో చెన్నైకి చెందిన ఎల్.శ్రీనివాసన్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ ఎంవీఎన్.పద్మజ సోమవారం తీర్పు చెప్పారు. మైనింగ్ వ్యాపార లావాదేవీల్లో భాగంగా కర్నూలు నగరానికి చెందిన ఎస్‌ఎ మినరల్ అధినేత ఎస్‌ఎండీ సోహైల్‌కు చెన్నైకు చెందిన వీఎల్‌ఎస్ లాజిస్టిక్ సంస్థ అధినేత ఎల్.శ్రీనివాసన్ రూ. 2కోట్లకు చెక్కు ఇచ్చాడు.

05/21/2018 - 23:55

ఏన్కూరు, మే 21: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల మరిధిలోని భగవన్‌నాయక్‌తండాలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన గుగ్గులోత్ రమేష్ (33) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేష్‌కు మణుగూరుకు చెందిన అనూషతో గత సంవత్సరం వివాహం జరిగింది.

05/21/2018 - 23:35

కుప్పం, మే 20: తమిళనాడు ఆర్టీసీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గుడుపల్లి ఎస్సై భాస్కర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం చిన్న బొమ్మరసపల్లి గ్రామానికి చెందిన చంద్రప్ప భార్య సరస్వతి(39), కుమారులు ప్రకాష్(18), సుబ్రమణ్యం(24)లు ద్విచక్రవాహనంలో ఆదివారం మధ్యాహ్నం ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్నారు.

05/21/2018 - 23:33

ప్రొద్దుటూరు, మే 21: ప్రభుత్వం వేలకు వేలు జీతాలు ఇస్తూ ఉద్యోగాలు చేయమంటే రాష్ట్రంలో కొందరు స్వార్థం కోసం ప్రజలను పట్టిపీడిస్తుంటారని అందులో భాగంగా కడప జిల్లా యర్రగుంట్ల తహసీల్దారు కార్యాలయంలో సోమవారం ఏసీబీ వారు దాడులు నిర్వహించి మండలంలోని కల్లమల్ల వీఆర్‌ఓ భాషావల్లి లంచం తీసుకుంటుండగా పట్టుకొని అరెస్టుచేసినట్లు ఏసీబీ డీఎస్పీ నాగరాజు తెలిపారు.

05/21/2018 - 23:33

ప్రొద్దుటూరు, మే 21: కడప జిల్లా యర్రగుంట్ల రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి సుబ్బరాయుడు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సోమవారం ఒంటేరు సుబ్బరాయుడు (72) అనే వ్యక్తి మతిస్థిమితంలేక యర్రగుంట్ల సమీపంలో రైలు వెళ్తుండగా హటాత్తుగా రైలు కమీలపై పనుకున్నాడు. ఆ రైలు కిందపడి శరీరం రెండు భాగాలు అయినట్లు చూపరులు కూడా చూడలేక కల్లు మూసుకున్నారని పోలిసులు తెలిపారు.

05/21/2018 - 23:17

రాప్తాడు, మే 21 : మండల కేంద్రంలోని స్థానిక 44వ జాతీయ రహదారిపై లింగనపల్లి క్రాస్ వద్ద కారు బోల్తాపడడంతో ఆరు మంది గాయపడ్డారు. రాప్తాడు ఎస్‌ఐ ధరనిబాబు తెలిపిన వివరాల మేరకు హైదరాబాద్‌కు చెందిన 6 మంది మిత్రులు కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి గుడికి వెళ్ళి తిరిగి వస్తుండగా రాప్తాడు సమీపంలోకి రాగానే కారుకుముందు టైరు పగలడంతో రోడ్డు పక్కన కారు బోల్తా పడింది.

05/21/2018 - 04:23

తంగళ్ళపల్లి, మే 20: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వల వేసి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు దండుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుద్యోగుల ఆశలను ఆసరాగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్న ముఠాలు రోజు రోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. బలహీనతలను ఆసరాగా తీసుకుని ఆన్‌లైన్ మోసాలతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

05/21/2018 - 04:20

జగిత్యాల రూరల్: జగిత్యాల మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన గొల్లపల్లి శ్రీనివాస్ (33) అనే రైతు వడదెబ్బతో ఆదివారం మృతి చెందాడు. జగిత్యాల రూరల్ ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం కల్లెడ గ్రామానికి చెందిన గొల్లపల్లి శ్రీనివాస్ అనే రైతు తన పొలం పనులకు వెల్లగా వడదెబ్బ సోకి అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలిపారు.

05/21/2018 - 03:41

మంగళగిరి, మే 20: గుంటూరు జిల్లా మంగళగిరి - విజయవాడ రోడ్డు మార్గంలో నులకపేట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు కొమ్మతోటి శ్రీకాంత్(29), సరిత(25), వారి కుమార్తె అక్షర(3) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.

05/21/2018 - 03:37

కల్లూరు, మే 20: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామంలో పదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 40ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదైంది. గ్రామానికి చెందిన బాలిక తమ ఇంటిలో టీవీ చూస్తుండగా ఒంటరిగా ఉన్నట్లు గమనించిన మాడుగుల కృష్ణ అనే వ్యక్తి ఇంటిలోకి ప్రవేశించారు. బాలిక నోరునొక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు.

Pages