S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/23/2018 - 01:21

సైదాపూర్, మే 22: మండలంలోని బొమ్మకల్ గ్రామంలో జనబోయిన నర్సయ్య (75) అనే వృద్ధుడిని చున్నీతో మెడకు ఉరివేసి నులిపి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన మంగళవారం గ్రామంలో చోటు చేసుకుంది. సైదాపూర్ ఎస్‌ఐ నూతి శ్రీ్ధర్, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..మృతుడు నర్సయ్యకు రెండు ఎకరాల భూమి ఉండగా, ఆ భూమిని తన కొడుకు వెంకటస్వామికి ఆరు సంవత్సరాల క్రితమే రిజిస్ట్రేషన్ చేయించారు.

05/23/2018 - 01:19

కాల్వశ్రీరాంపూర్, మే 22: మండలంలోని కూనారం గ్రామంలో మిషన్ కాకతీయ పనులలో భాగంగా మంగళవారం మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడడంతో ఒకరు మృతి చెందారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..కూనారం గ్రామానికి చెందిన పానుగంటి సదానందం (35) అనే ట్రాక్టర్ డ్రైవర్ చెరువు కట్టపై నుండి మొరం తీసుకొని వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి కట్టకిందికి బోల్తాపడింది. దీంతో డ్రైవర్ సదానందం అక్కడికక్కడే మృతి చెందాడు.

05/23/2018 - 01:10

కంకిపాడు, మే 22: ఇంటి ముందు ఆరుబయట విశ్రాంతి తీసుకుంటున్న మహిళ మెడలో గొలుసు తెంచుకొని పరారైన ఘటన మండలంలోని గొడవర్రులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని శివాలయం సమీపంలో నివసించే పైకం సునీత సోమవారం రాత్రి 8గంటల సమయంలో ఇంటి ఆవరణలో మంచం వేసుకొని నడుంవాల్చి విశ్రాంతి తీసుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన దొంగ ఆమె మెడలోని 5కాసుల బంగారు నాంతాడును తెంచుకుని పరారయ్యాడు.

05/23/2018 - 00:49

వీరవాసరం, మే 22: ఇటీవల ప్రసార మాధ్యమాల్లో సైకోలు తిరుగుతున్నారంటూ వదంతులు వస్తున్న నేపథ్యంలో మంగళవారం వీరవాసరంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక వ్యక్తిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. పెరిగిన జుత్తు, గెడ్డం, మాసిబోయిన దుస్తులతో ఆ వ్యక్తి చూసేందుకు భయంకరంగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు అప్పగించారు.

05/23/2018 - 00:26

మారేడుమిల్లి, మే 22: మారేడుమిల్లి మండలం గుజ్జుమామిడివలస పంచాయితీ పరిధిలోని వాలమూరు గ్రామంలో గల పాములేరు వాగులో పడి మంగళవారం ఒక యువకుడు మృతి చెందగా మరో యువకుడు గల్లంతయ్యాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన నందికళ్ళ మణీంద్ర (21), గ్రంధి బుచ్చిరాజుగుప్త (21) పాములేరువాగులో స్నానం చేస్తుండగా గల్లంతయ్యారు.

05/23/2018 - 00:26

పెద్దాపురం, మే 22: పట్టణంలో దొంగ నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఒక లక్షా 42వేల 600 విలువ గల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు పెద్దాపురం డీఎస్పీ చిలకా వెంకట రామారావు తెలిపారు.

05/23/2018 - 00:25

కొత్తపేట, మే 22: మండల పరిధిలోని అవిడి శివారు అమలాపురం ప్రధాన రహదారిపై మోటారు సైకిల్‌ను కారు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై హరీష్‌కుమార్ తెలిపారు. మండల పరిధిలోని మోడేకుర్రుకు చెందిన నంద్యాల సత్యనారాయణ (60), బద్దిరెడ్డి సూర్యనారాయణ (60) మృతి చెందగా, గంగుమళ్ల లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై తెలిపారు.

05/23/2018 - 00:17

రుద్రవరం మే 22: మండలంలోని చిలుకలూరు గ్రామంలో బట్టలు ఉతికేందుకు వక్కిలేరు కుంట వద్దకు వెళ్లి కుటలో పడి తల్లీకూతురు మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. వేసవి సెలవులు కావడంతో చిలుకలూరుకు చెందిన చాంద్‌బీబీ ఇంటికి నంద్యాల పట్టణం, గుట్టవీధికి చెందిన ఆమె అక్క హుసేన్ భాను (43), ఆమె కుమార్తె హబిబూన్ (14) వారం రోజుల క్రితం వచ్చారు.

05/23/2018 - 00:14

నందికొట్కూరు, మే 22:పగిడ్యాల మండల పరిధిలోని సంకిరేణిపల్లె గ్రామానికి చెందిన కౌలు రైతు నాగిరెడ్డి(30) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ముచ్చుమర్రి ఎస్‌ఐ కిరణ్‌బాబు తెలిపిన వివారాలు.. గ్రామానికి చెందిన నాగిరెడ్డి ఐదెకరాల సొంత పొలంతో పాటు ముంపునకు గురైన మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగుచేశారు. మినుము, శెనగ పంటల సాగు కోసం దాదాపు రూ.

05/23/2018 - 00:11

గజపతినగరం,మే22: ఉద్యోగం ఆశ చూపి నిరుద్యోగి నుండి లక్షలాది రూపాయలు స్వాహా చేసిన నిందితుడుని స్దానిక పోలీస్‌ష్టేషన్ హెచ్ సి పెదమజ్జి శ్రీను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దత్తిరాజేరు మండలం తిమిటేరు బూర్జివలస గ్రామానికి చెందిన చిప్పాడ శ్రీనువాసరావు గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామం పరిధిలో గల మామిడిబందకాలనీలో గత కొంత కాలంగా నివాసం ఉంటున్నాడు.

Pages