-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
న్యూఢిల్లీ/శ్రీనగర్, ఆగస్టు 27: కాశ్మీరీ యువతిని హోటల్కు తీసుకెళ్లిన ఘటనలో దోషిగా తేలడంతో మేజర్ లీతుల్ గొగాయ్పై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని ఆర్మీ కోర్టు ఆదేశించింది. ఈ విషయాన్ని ఆర్మీ అధికార వర్గాలు సోమవారం ధృవీకరించాయి. విధి నిర్వహణలో ఉంటూనే గొగాయ్ మే 23న స్థానిక 18 ఏళ్ల యువతిని తీసుకుని సుదూరంలోని హొటల్కు వెళ్లాడు.
అహ్మదాబాద్, ఆగస్టు 27: గోధ్రాలో రైలుకు నిప్పంటించి 59 మంది సజీవదహనానికి కారణమైన కేసుకు సంబంధించి మరో ఇద్దరికి ప్రత్యేక కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ముగ్గుర్ని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటికి 33 మంది దోషులకు శిక్షలుపడ్డాయి. 2002 ఫిబ్రవరి 27న గోధ్రా రైలు మారణకాండలో 59 మంది కరసేవకులు మృతి చెందారు.
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 27: అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లితో వెళ్లిన ఓ చిన్నారి అదే స్కూల్ బస్సు కిందపడి దుర్మరణం చెందిన సంఘటన ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి స్థానికులు, బంధువుల కథనం ప్రకారం బొంగ్లూరు గ్రామంలోని అంతఃపురం కాలనీకి చెందిన చందన, వెంకటేష్ దంపతుల కుమార్తె ప్రతీక (2) అన్న బొంగ్లూరు గేటు సమీపంలో ఉన్న సాహితీ పాఠశాలలో చదువుతున్నాడు.
ఎల్కతుర్తి, ఆగస్టు 27: జీవితంపై విరక్తి చెంది భార్యను కత్తితో పొడిచి హత్య చేసి భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
చల్లపల్లి, ఆగస్టు 27: బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు రేవులో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఆముదార్లంకలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన కళ్లేపల్లి శివాజి (68) పంచాయతీలో పని చేస్తూ ఉదయానే్న వాటర్ వదిలేందుకు పంప్ హౌస్కు వెళ్లి ఆ తరువాత బహిర్భూమికి వెళ్లి రేవులో జారి పడ్డాడు. నదిలో వరద నీరు ఎక్కువగా ఉండటంతో నీట మునిగి మృతి చెందాడు.
విశాఖపట్నం(క్రైం), ఆగస్టు 27: తెలుగు యువత అధ్యక్షుడు సుధాకర్ దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వమని హతుడు వేధించడంతో దూరపు బంధువే సుత్తితో తలపై బలంగా మోదడంతో తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎంవీపీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
నక్కపల్లి, ఆగస్టు 27: తోడుగా ఉన్న క్లీనర్నే డ్రైవర్ కర్కశంగా హత్య చేశాడు. మండలంలోని కాగిత జంక్షన్ సమీపంలో సోమవారం లారీ డ్రైవర్ లారీడ్రైవర్ మరకట్ల డానియల్ (51), ( పశ్చిమ గోదావరి జిల్లా) అదే లారీలో పనిచేస్తున్న క్లీనర్ తాడి విజయ్కుమార్ (45)ను ఒక పథకం ప్రకారం హత్యచేశాడు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుండి రొయ్యపొట్టు లోడ్చేసుకుని విశాఖపట్నం తీసుకువస్తున్నా డు.
భైంసా రూరల్, ఆగస్టు 27: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని మహరాష్ట్ర సరిహద్దులో గల మారుముల గ్రామం అంబుగాంలో అమానూషం జరిగింది. ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో అత్తమామ, భర్త వేదింపులకు మూడు ప్రాణాలు బలైపోయాయి. భాధిత కుటుంబీకుల కథనం ప్రకారం అంబకంటి తండాకు చెందిన జాదవ్ వసంత్- జిజాబాయిల కూతురు సుశీలబాయికి 2016లో అంబుగాం గ్రామానికి చెందిన అడే సంతోష్తో వివాహం జరిగింది.
ముకరంపుర కరీంనగర్, ఆగస్టు 27: ఒఎల్ఎక్స్ యాడ్స్ పేరుతో నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేసు తన్న కేటుగాడు కట్కూరి శరత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేఖరులకు ఏసీపీ వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా దేశాయిగూడెంకు చెందిన శరత్ రెడ్డి బీటెక్ పూర్తిచేసి కొంత కా లం కేసీఆర్ కిట్ పథకంలో ఔట్ సో ర్సింగ్ ఉద్యోగిగా పనిచేశాడు.
సత్యవేడు, ఆగస్టు 27: పేదవాడికి అందాల్సిన రేషన్ బియ్యం కొందరు రేషన్ డీలర్ల చేతివాటం వలన పక్కదారి పడుతోంది. రేషన్ తూనికలు కొలతల్లో వ్యతాసాల వలన పేదవాడికి అందాల్సిన రేషన్ సరుకులు సక్రమంగా అందడం లేదు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపం వలన అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది.