S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/04/2018 - 03:16

భారతదేశం అంటే హిందూ దేశం. హిందుత్వం సనాతనం. క్రీ.శ. 633 నుండి మన దేశంపై దండయాత్రలు కొనసాగించిన ఇస్లాంలు మొదటిసారిగా క్రీ.శ.712లో విజయం సాధించారు. ఆనాటి నుండి నిరంతరం ఇస్లాం ఆక్రమణదారులు మన దేశంపై దండయాత్రలు కొనసాగించారు. తిరుగులేని రీతిలో వారు రాజ్యాధికారం చేశారు. రాజ్యాధికారం అందిపుచ్చుకొన్న ఇస్లాంలు అంతటితో ఆగకుండా భారతీయ సంస్కృతిని, సాహిత్యాన్ని, భాషలను, దేవాలయాలను ధ్వంసం చేశారు.

12/02/2018 - 00:21

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు నియమితులైనట్టు ఆ పార్టీ అధికారికంగా ఇటీవల ప్రకటించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ముప్పాళ లక్ష్మణరావు అలియాస్ గణపతి పాతిక సంవత్సరాలపాటు పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీకి సేవలు అందించి వృద్ధాప్యం, ఆరోగ్య కారణాల రీత్యా స్వచ్ఛందంగా ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వైదొలగినట్టు తెలుస్తోంది.

12/01/2018 - 00:51

ఆత్మవిమర్శ చేసుకున్నాడో, జ్ఞానోదయం కలిగిందో లేక అవసరార్థమో గాని ‘ప్రజాగాయకుడు’ గద్దర్ ప్రజల్లో ‘ఓటు చైతన్యం’ తెస్తానని బయలుదేరాడు. భార్యా సమేతంగా ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్ గాంధీలను కలసి- తన కుమారుడికి కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు. ప్రతిపక్షాలన్నీ కోరితే ఏకంగా తెరాస అధినేత కేసీఆర్‌నే ఢీకొంటానని పెద్ద ‘ఆఫర్’ కూడా ఇచ్చాడు.

11/30/2018 - 00:15

పాఠశాలల్లో ఉన్న వివిధ నైపుణ్యాలను ఒక రంగానికే పరిమితం చేయకుండా, ఆ రంగంలో ఏర్పడిన స్ఫూర్తిని వివిధ రంగాలలో ఉపయోగించటమే ఈ యుగం గొప్పతనం. కబడ్డీ ఆడుతుంటే మొత్తం జట్టు ఒక శక్తిగా ఏర్పడుతుంది. ఏడు రంగులు కలిస్తే ఒక కిరణం ఏర్పడుతుంది. దానే్న భానుకిరణం అంటారు. ఆటల్లో ఏర్పడిన స్ఫూర్తిని తరగతి గదికే కాకుండా మొత్తం పాఠశాలకు బదలాయించటాన్ని ‘టీమ్ స్పిరిట్’ అంటాం.

11/27/2018 - 23:54

నిజాం రాజంతటి గొప్ప పరిపాలకుడు దేశంలో మరెవ్వరూ లేరు. గర్వించతగ్గ నిజాం చరిత్రే తెలంగాణ చరిత్ర’’- అని చెప్పే తెరాస పార్టీ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అంతటితో ఆగకుండా నిజాం చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టాలని, ప్రజల చేత నిత్యం పారాయణం చేయించాలని కంకణం కట్టుకున్నట్లున్నది. అంతేకాదు..

11/27/2018 - 01:49

కాంగ్రెస్ పార్టీ ‘లోగో’ గురించి తెలియనివారు, దాన్ని చూడనివారు కూడా ఈ దేశానికి ఆ పార్టీయే స్వాతంత్య్రం తెచ్చింది, ఆర్.ఎస్. ఎస్. వారు చేసిందేమీ లేదని ఆరోపిస్తుంటారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ పుట్టకముందు దేశం కోసం బలిదానాలు చేసినవారు ఎందరో ఉన్నారు కదా?

11/25/2018 - 01:03

మన దేశంలో ‘ఉమ్మడి పౌరస్మృతి’ అంశం చాలాకాలంగా ఆలోచనల స్థాయిలోనే మిగిలి ఉంది. దీనిపై ఇంతవరకూ ఎలాంటి ఫలవంతంగా చర్చలు గానీ, నిర్ణయాలు గానీ జరగలేదు. ఉమ్మడి పౌరస్మృతి గురించి భారత రాజ్యాంగంలోని 44వ అధికరణంలో ఏకపంక్తి వాక్యంలో ప్రస్తావించారు. దానిని హృదయ పూర్వకంగా రాయలేదని చాలామంది అభిప్రాయం. దీన్ని ఎందుకో దృఢ నిర్ణయంతో రాయలేదు. అది ఇలా వుంది.

11/24/2018 - 01:16

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న వైఖరి ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఏపీకి ఇచ్చిన వరాలపై- నాలుగున్నరేళ్ళు గడిచినా మోదీలో ఎలాంటి చలనం లేదు. ప్రజాస్వామ్య దేశంలో అత్యున్నతమైన పార్లమెంటు ఆమోదం పొందిన విభజన హామీలను అమలు చేయాలన్న ధ్యాస కేంద్ర ప్రభుత్వంలో లేకపోవడం విచారకరం.

11/23/2018 - 01:30

దేశానికి యుద్ధం బెడద వచ్చినపుడు సరిహద్దుల్లో శత్రుసేనలను తరిమికొట్టి ‘భారతమాతాకీ జై’ అని మన జవాన్లు నినదిస్తారు. అసదుద్దీన్ ఒవైసీ లాంటి వాళ్ళు మాత్రం ‘్భరత్ మాతాకీ జై’ అనాలని రాజ్యాంగంలో వుందా? అని ప్రశ్నిస్తారు. జవాన్ల కంటే ఒవైసీ మొనగాడా? రజాకార్ల పార్టీని కొనసాగిస్తున్న ఒవైసీ గతంలో రజాకార్లు తెలంగాణలో చేసిన అరాజకాలకు క్షమాపణ ఎందుకు చెప్పరు? చెప్పమని కేసీఆర్ ఎందుకు అడగరు?

11/21/2018 - 01:09

ఎప్పటికే ‘ప్లాన’వసర
మప్పటికా ‘ట్రిక్సు’చేసి అఖిల ప్రజలన్
తప్పేమి తనదికాన
ట్టెప్పటి కొప్పించు పాలిటిషియనె గ్రేటోయ్!

Pages