S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/18/2018 - 01:51

అధికార పార్టీ ఆత్మవిశ్వాసంతో ఎన్నికల పోరులో అడుగుపెట్టి, మళ్లీ అఖండ మెజారిటీతో గెలిచిందంటే- కచ్చితంగా ఆ ప్రభుత్వం ప్రజలకు మేలుచేసినట్టు, సమర్ధవంతమైన పాలనను అందించినట్టు మనం భావించి అభినందించాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో మళ్ళీ అధికార పార్టీనే భారీ మెజారిటీతో ఓటర్లు గెలిపించడం ఈ విషయానే్న నిరూపిస్తున్నది. ఏ పార్టీ ఎలాంటిదో, ఏ నాయకుడు ఎలాంటివాడో ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు.

12/16/2018 - 02:36

ఓటరు స్వేచ్ఛగా, రహస్యంగా తన అభిప్రాయాన్ని ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థుల పట్ల తన ఓటు ద్వారా సానుకూలంగా లేక వ్యతిరేకంగా వ్యక్తం చేయటం జరుగుతుంది. ఓటు ద్వారా వెల్లడయ్యే ఈ ప్రజావాంఛ తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా వెల్లడయ్యిందో ఓసారి పరిశీలిద్దాం. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పలువురి అంచనాలను మించి భారీగా పోలింగ్ నమోదయ్యింది. పోలింగ్ రమారమి 75 శాతం వరకు జరిగింది.

12/14/2018 - 02:03

ఎక్కడ సాధన ఉండదో అక్కడ బోధన ఉండదు అంటారు. ఎక్కడ విద్యార్థి ఉండడో అక్కడ ఉపాధ్యాయుని అస్తిత్వం కనపడదు అంటారు. బోధించేటప్పుడే ఉపాధ్యాయుడు నేర్చుకుంటాడు. తను చదువుకున్నది వల్లెవేయటం కాదు. విద్యార్థుల్లో ఉండే ఆసక్తే ఉపాధ్యాయుని సాధనకు మూలం. విద్యార్థులు చేసే తప్పులు ఒప్పులను సరిచేసే మార్గమే ఉపాధ్యాయునికి సాధన.

12/11/2018 - 23:57

యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూసింది. జాతీయ స్థాయి మీడియా సంస్థల ప్రతినిధులు, రాజకీయ విశే్లషకులు తెలంగాణ ఎన్నికల్లో తెరాస మళ్లీ గెలుస్తుందని చెప్పిన ‘ఎగ్జిట్ పోల్స్’ నిజమయ్యాయి. అయితే, ఎన్నికల ఫలితాలు ఈ స్థాయిలో ఏకపక్షంగా ఉంటాయని ఎవరూ ఊహించలేదు. తెలంగాణ ప్రజల మనోభావాలను పూర్తిగా అధ్యయనం చేసి, రాజకీయ పంచతంత్రాలను ఔపోసన పట్టిన తెరాస అధినేత కేసీఆర్ ‘చాణక్య వ్యూహం’తో ప్రత్యర్థులను చిత్తుచేశారు.

12/11/2018 - 01:52

సమాచార సాంకేతిక రంగం (ఐటీ)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో ప్రథమ స్థానానికి చేరుకొంది. ప్రభుత్వంలోని అన్ని శాఖలకు ‘ఈ-ప్ర గతి’ క్రమంగా విస్తరిస్తోంది. ‘ఈ-ప్రగతి’ మొదటి దశ కింద ముందుగా 14 శాఖల అనుసంధాన ప్రక్రియ అధికారులు పూర్తిచేస్తారు. రెండు, మూడు దశల్లో భాగంగా మిగిలిన శాఖలను కూడా అనుసంధానం చేస్తారు.

12/09/2018 - 02:34

‘ఎప్పుడూ ఎడతెగక ప్రవహించే ఏరు’ బతకటానికి ఇచ్చే స్వచ్ఛతా ప్రాధాన్యతను సుమతీ శతకకారుడు ఏనాడో ప్రస్తావించాడు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ జలవనరుల మంత్రిత్వశాఖ- పర్యావరణానికి పెట్టనికోటగా, పవిత్ర గంగానదిని అవిరళ జలప్రవాహంగా పయనింపచేయాలనే స్వచ్ఛ ఆలోచనలతో తలమునకలవుతోంది. హిమాలయ పర్వత శిఖరాల నుండి జాలువారే నదులు ప్రస్తుత స్థితిగతులలో జీవం కోల్పోవడం మనకు తెలిసిందే.

12/08/2018 - 00:13

ఒక చిన్న ఆలోచనను వ్యాపార అవకాశంగా మలుచుకొని సంపద సృష్టించడం మహాగొప్ప విషయం. ఇది సేవా సంబంధిత వ్యాపారమే కావొచ్చు లేదా మరింత కష్టమైన విషయమే కావొచ్చు. కానీ కేవలం ఆలోచనకు పదునుపెట్టి దానినే పెట్టుబడిగా వ్యాపారం ప్రారంభించి, అనతికాలంలో అవిరళ కృషి చేసి అతిపెద్ద సంస్థగా అభివృద్ధి చేసి, అనంతమైన సంపదను సృష్టించి అనేకమందికి ఉపాధి కల్పిస్తున్న వారి విజయగాధలు అనేకం మనం చూస్తూనే ఉన్నాం.

12/07/2018 - 02:14

కేజీ స్కూలు తెరుస్తున్నారు. పిల్లలు పలకలు తీసుకువస్తారు. తల్లిదండ్రులు వారం రోజులు పరిశీలించారు. ‘పలక మీద ఒక అక్షరం ముక్క దిద్దలేదు. వారం రోజులు గడిచాయి ఇక స్కూలు ఎందుకు? మా పిల్లలను రేపటి నుంచి బడికి పంపేదిలేద’ని తల్లిదండ్రులు అన్నారు. ఇంద్రియ జ్ఞానం ద్వారా పిల్లలకు దృష్టి ఏర్పడాలి. ఆ దృష్టి ఏర్పడాలంటే పిల్లలు ప్రతి విషయాన్నీ పరిశీలించాలి. పరిశీలనతో మెదడులో దృశ్యాల స్వరూపం ఏర్పడుతుంది.

12/06/2018 - 21:42

మన దేశంలో ప్రతిరోజూ 50 మంది వరకూ రైతులు ఎక్కడో ఒకచోట బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడం, సేద్యం ఖర్చులు పెరిగిపోవడం, విత్తనాల సమస్య, ప్రభుత్వాల ఉదాసీనత రైతుల బతుకుల్ని చిదిమేస్తున్నాయి. మహారాష్టక్రు చెందిన సంజయ్ సాథే నాలుగు నెలలు కష్టపడి 750 కిలోల ఉల్లిపాయలు పండించగా అతనికి వచ్చిన ఆదాయం కేవలం రూ.1064 రూపాయలు.

12/05/2018 - 03:15

మధ్య అమెరికా దేశాల ప్రజల ‘మహావలస’ కొనసాగుతోంది. తమ తమ దేశ ల్లో పాలన అస్తవ్యస్తంగా ఉండటం, జీవనం సజావుగా సాగకపోవడం, భవిష్యత్ అంధకార బంధురంగా కనిపించడంతో ఆ ప్రజలు అగ్రదేశమైన అమెరికాలో బతికేందుకు వలసబాట పట్టారు.

Pages