-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
రియో డి జెనీరో: రియో ఒలింపిక్స్లో తెలుగు తేజం పివి సింధు బాడ్మింటన్ మహిళల సింగిల్స్లో ఫైనల్ చేరడమే లక్ష్యంగా దూసుకెళుతున్నది. సెమీ ఫైనల్లో జపాన్కు చెందిన నొజోమీ ఒకుహరాను ఢీకొననున్న ఆమె క్వార్టర్స్లో ఇహాన్ వాంగ్ను 22-20, 21-19 తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్లో సెమీస్ చేరిన భారత రెండో బాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
రియో డి జెనీరో: మహిళల 800 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ టింటూ లుకా హీట్స్లోనే ఓటమిపాలైంది. లక్ష్యాన్ని 2:00.53 నిమిషాల్లో పూర్తి చేసిన ఆమె 29వ స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన వివాదాస్పద అథ్లెట్ కాస్టర్ సెమెన్యా హీట్స్లో అందరి కంటే ముందుగా లక్ష్యాన్ని చేరి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.
రియో డి జెనీరో: ఇరాన్ వెయిట్లిఫ్టర్ బెదాద్ సలీమికొర్డాసియాబి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పురుషుల 105 కిలోలకు మించిన సూపర్ హెవీవెయిట్ ఈవెంట్ స్నాచ్లో అతను 216 కిలోల బరువునెత్తాడు. సలీమీగా అందరికీ సుపరచితుడైన అతను జార్జియాకు చెందిన లషా తలకజే రికార్డును బద్దలు చేశాడు. తలకజే 215 కిలోలతో రికార్డు నెలకొల్పగా సలీమీ ఆ దానిని అధిగమించాడు. అయితే, అతనికి స్వర్ణ పతకం దక్కలేదు.
న్యూఢిల్లీ, ఆగస్టు 17: భారత క్రీడా రంగంలో ప్రతిష్ఠాత్మకమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఈ ఏడాది ఎవరికి దక్కుతుందనే ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది. రియో ఒలింపిక్స్కు అర్హత సంపాదించి సంచలనం సృష్టించిన మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్కు ఈ అవార్డు దక్కాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. ఒలింపిక్స్లోకి అడుగుపెట్టడమేగాక, చివరి వరకూ తీవ్ర స్థాయిలో పోరాడిన ఆమె నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
రియో డి జెనీరో: బాడ్మింటన్ పురుషుల విభాగంలో తెలుగు వీరుడు కిడాంబి శ్రీకాంత్ పోరాటానికి తెరపడింది. చైనాకు చెందిన మూడోసీడ్ లిన్ డాన్తో చివరి వరకూ హోరాహోరీగా పోరాడిన శ్రీకాంత్ 6-21, 21-11, 18-21 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. మొదటి సెట్లో ఏమాత్రం పోటీని ఇవ్వలేక చేతులెత్తేసిన శ్రీకాంత్ రెండో సెట్లో అనూహ్యంగా ఎదురుదాడికి దిగాడు.
రియో డి జెనీరో, ఆగస్టు 17: అమెరికా యువ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ రియో ఒలింపిక్స్ను స్వర్ణ పతకంతో ముగించింది. టీం, ఆల్రౌండ్, వాల్ట్ ఈవెంట్స్లో విజేతగా నిలిచిన ఆమె బ్యాలెన్స్ బీమ్ విభాగంలో అనూహ్యంగా కాంస్య పతకంతో సరిపుచ్చుకుంది. అయితే, చివరి ఈవెంట్ ఫ్లోర్ ఎక్సర్సైజ్లో మళ్లీ సత్తా చాటిన ఆమె స్వర్ణాన్ని అందుకుంది.
కొలంబో, ఆగస్టు 17: రంగన హెరాత్ స్పిన్ మాయాజాలం ఆస్ట్రేలియాపై శ్రీలంకకు తిరుగులేని విజయాన్ని అందించింది. మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. 324 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా 44.1 ఓవర్లలో కేవలం 160 పరుగులకే కుప్పకూలింది. హెరాత్ 64 పరుగులిచ్చి ఏడు వికెట్లు కూల్చి, లంకకు చారిత్రక విజయాన్ని సాధించిపెట్టాడు.
న్యూదిల్లీ: రియో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శనతో భారతీయుల హృదయాలను గెలిచిన జిమ్నాస్ట్ దీపా 23ఏళ్ల దీపా కర్మాకర్ను ఖేల్రత్న పురస్కారానికి ప్రతిపాదించినట్లు సమాచారం. ఓ భారత జిమ్నాస్ట్ ఒలింపిక్స్లో పోటీ పడటమే గొప్ప అనుకుంటే దీప ఏకంగా ఫైనల్ చేరి అంచనాలను మించి ఆకట్టుకుంది. ఫైనల్లో ఇతర జిమ్నాస్ట్లకు గట్టి పోటీనిచ్చి తృటిలో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
రియో డి జెనిరో, ఆగస్టు 16: ప్రపంచ చాంపియన్షిప్స్లో రెండుసార్లు కాంస్య పతకాన్ని గెలుచుకున్న ‘తెలుగు తేజం’ పివి.సింధు రియో ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది.
రియో డి జనిరో, ఆగస్టు 16: రియో ఒలింపిక్స్ మహిళా జిమ్నాస్టిక్స్లో అయిదు స్వర్ణ పతకాలు సాధించాలన్న సైమన్ బైల్స్ ప్రయత్నానికి బీమ్ విభాగంలో మూడోస్థానానికి పరిమితం కావడంతో ఎదురుదెబ్బ తగిలింది. ఈ విభాగంలో నెదర్లాండ్స్కు చెందిన సనే్న వేవర్స్ స్వర్ణ పతకం సాధించింది. ఇప్పటికే టీమ్ ఈవెంట్తో పాటుగా ఆల్రౌండ్, వాల్ట్ విభాగాల్లో బైల్స్ స్వర్ణ పతకాలు సాధించిన విషయం తెలిసిందే.