-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
రియో డి జెనీరో, ఆగస్టు 20: అథ్లెటిక్స్ రంగంలో భారత్ ఫ్లాప్ షో కొనసాగుతున్నది. పురుషుల 50 కిలోమీరట్ల నడకలో సందీప్ కుమార్ 34వ స్థానంలో నిలిచాడు. 49 మంది రేసర్లు పోటీపడగా, సందీప్ లక్ష్యాన్ని 4 గంటల, 7.55 నిమిషాల్లో చేరాడు. స్వర్ణ పతకం సాధించిన మతేజా టోత్ (స్లొవేకియా) కంటే అతను ఏకంగా 26.57 నిమిషాలు ఆలస్యంగా రేస్ను పూర్తి చేశాడు.
రియో డిజెనీరో: రియో ఒలింపిక్స్లో ఎన్నో రికార్డులు సృష్టించిన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ రాజకీయాల్లోకి రావాలంటూ జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ సాదర ఆహ్వానం పంపారు. బోల్ట్ కోరుకుంటే మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా సిద్ధమంటూ జమైకా ప్రధాని బంపర్ ఆఫర్ ప్రకటించారు.
ముంబయి: ఒలింపిక్ రజతం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు గురువు పుల్లెల గోపిచంద్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి పేరు ప్రస్తుతానికి పుల్లెల గోపీచంద్ అనే పెట్టారు. తెలుగు, హిందీ భాషల్లో నిర్మించే ఈ చిత్రానికి అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
దిల్లీ: ఒలింపిక్స్కు వెళ్లిన తొలి భారతీయ జిమ్నాస్ట్గా చరిత్ర సృష్టించిన త్రిపురకు చెందిన దీపా కర్మాకర్కు శనివారం ఉదయం దిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పతకం చేజారినప్పటికీ, దీప తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. దిల్లీ విమానాశ్రయంలో అభిమానులు, మీడియా ప్రతినిధులు దీపకు శుభాకాంక్షలు తెలిపారు. పూలమాలతో సత్కరించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 19: రియో ఒలింపిక్స్లో రజత పతకాన్ని సాధించిన భారత బాడ్మింటన్ స్టార్ యావత్ దేశానికే గర్వకారణమని పలువురు క్రీడాకారులు, ప్రముఖులు ప్రశంసించారు. సింధు రజత పతకం గెల్చుకోవడం ద్వారా భారత శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిందని రియో ఒలింపిక్స్కు భారత్ తరఫున బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న మాజీ టెస్టు క్రికెటర్ సచిన్ తెండూల్కర్ ట్వీట్ చేశాడు.
రియో డి జెనీరో, ఆగస్టు 19: రియో ఒలింపిక్స్లో భారత బాడ్మింటన్ స్టార్, హైదరాబాదీ పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ కరోలినా మారిన్ చేతిలో ఓడినప్పటికీ, లక్షలాది మంది అభిమానుల మనసులు గెల్చుకుంది. స్పెయిన్కు చెందిన మారిన్తో తలపడిన సింధు కడవరకూ పోరాడింది. ప్రత్యర్థికి అడుగడుగునా సవాళ్లు విసిరింది. తిరుగులేని స్మాష్లు, అద్భుతమైన ప్లేసింగ్స్తో విజయంపై ఆశలు పెంచింది.
రియో డి జెనీరో, ఆగస్టు 19: ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ స్ప్రింట్లో తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేశాడు. రియో ఒలింపిక్స్ 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన అతను తాజాగా 200 మీటర్ల విభాగంలోనూ విజేతగా నిలిచాడు. 19.78 సెకన్లలో గమ్యాన్ని చేరిన అతను స్ప్రింట్ డబుల్ను సాధించాడు. బీజింగ్ ఒలింపిక్స్లో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుతోపాటు 4న100 మీటర్ల రిలేలోనూ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
రియో డి జెనిరో, ఆగస్టు 19: ఒలింపిక్ పురుషుల హాకీలో అర్జెంటీనా జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో ఆ జట్టు 4-2 గోల్స్ తేడాతో బెల్జియం జట్టును మట్టికరిపించింది.
రియో డి జెనిరో, ఆగస్టు 19: ఒలింపిక్స్లో భారత్కు పతకాన్ని తీసుకురావాలని ఎంతో ఆశతో రియోకి వెళ్లిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్కు తీవ్రమైన నిరాశ ఎదురైంది. డోపింగ్ కేసులో నర్సింగ్ యాదవ్కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఇచ్చిన క్లీన్ చిట్ను అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్) తోసిపుచ్చి నాలుగేళ్ల నిషేధం విధించడంతో బరిలోకి దిగకముందే అతని ఆశలు నీరుగారి పోయాయి.