-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
తిరువనంతపురం, ఫిబ్రవరి 10: ప్రధాని నరేంద్ర మోదీది అంతా ఆడంబరం తప్ప మరేమీ లేదని, ఎన్నికల సమయంలో హిందూ, ముస్లింలను చీల్చడమన్న ప్రధాన లక్ష్యంతో ఆర్ఎస్ఎస్తో కలిసి ఆయన విష ప్రచారానికి దిగుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. అంతేకాదు ప్రధానికి ఏ విషయంపైనా అవగాహన లేదని, తన ఆలోచనలతో మీడియాలో భారీ ప్రచారం చేసుకుంటారని కూడా రాహుల్ అన్నారు.
కొక్రాజార్, ఫిబ్రవరి 10: కాంగ్రెస్ హయాంలో అసోం అన్ని విధాలుగా నాశనమైందని బిజెపి అధ్యక్షుడు అమిత్షా ఆరోపించారు. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఇనే్నళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని, కేవలం తన కుటుంబాన్ని పెంచిపోషించుకున్నారని అన్నారు. గత పదిహేనేళ్లుగా కాంగ్రెసే అధికారంలో ఉన్నా ఎలాంటి అభివృద్ధి సాధించలేదని, అంతా అవినీతిమయంగా మారిందని ధ్వజమెత్తారు.
చెన్నై: రాష్ట్భ్రావృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీ బురద జల్లుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విరుచుకుపడ్డారు. అన్నాడిఎంకె ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలన్నీ అభూత కల్పనలేనని బుధవారం ఆమె విమర్శించారు. ప్రతిపక్షం దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని అన్నాడిఎంకె కార్యకర్తలను ఆమె పిలుపునిచ్చారు. ‘ప్రతిపక్షాలకు పనీపాటాలేదు.
ముంబయి, ఫిబ్రవరి 10: వీడియో లింకేజీలో సాంకేతిక సమస్య తలెత్తడంతో 26/11 ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడు డేవిడ్ కోల్మెన్ హెడ్లీ నుంచి బుధవారం వాంగ్మూలం రికార్డుచేయలేకపోయారు. దీంతో గురువారం అతడి నుంచి సాక్ష్యం నమోదు చేస్తారు. రెండ్రోజులుగా అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హడ్లీ ఇక్కడ కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: అత్యంత అనుభవజ్ఞులైన గవర్నర్లు తమ రాష్ట్రం అభివృద్ధికి ఉత్ప్రేరకంగా పని చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు టీం ఇండియాగా కలిసి పని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ బుధవారం రాష్టప్రతి భవన్లో జరుగుతున్న 47వ గవర్నర్ల సదస్సులో ముగింపు ఉపన్యాసం ఇస్తూ ఈ పిలుపు ఇచ్చారు. రాష్ట్రాలలో గవర్నర్లది అత్యంత కీలకమైన ఉన్నత పదవి.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఆర్థికంగా ఎదురవుతున్న భారాన్ని కుదించుకునేందుకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రయాణికులపై ఐదు నుంచి పదిశాతం మేర చార్జీల మోత వేసే అవకాశం కనిపిస్తోంది. త్వరలో ప్రవేశ పెట్టనున్న రైల్వే బడ్జెట్లో ప్రయాణికుల చార్జీలను పెంచే ప్రతిపాదనలపై చురుగ్గా పరిశీలన జరుగుతోంది.ప్రయాణ, రవాణ మార్గాల్లో వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గి పోవడంతో రైల్వే శాఖ నిధుల కొరతతో కుదేలవుతోంది.
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని సిలిగురిలో మంగళవారం రాత్రి వీధుల్లో ప్రత్యక్షమైన ఓ ఏనుగు నానా బీభత్సం సృష్టించింది. దీని దాడిలో సుమారు 150 ఇళ్లు, ఆరు భవనాలు ధ్వంసమయ్యాయి. బైకుంతపూర్ అటవీ ప్రాంతం నుంచి తప్పించుకొని వచ్చిన ఈ ఏనుగు ఇళ్ల మధ్యకు రావడంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. గజరాజును బంధించేందుకు అటవీ శాఖ అధికారులు సమాయత్తమయ్యారు.
గౌహతి: అస్సాం మాజీ సి.ఎం. ప్రఫుల్లకుమార్ మహంతా బుధవారం కారులో నాగోల్కు వెళ్తుండగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఢీకొంది. దాంతో ఆయన కాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.
ముంబై: ముంబై దాడుల కేసులో నిందితుడైన డేవిడ్ హెడ్లీ అమెరికాలోని జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబై కోర్టు బుధవారం జరపాల్సిన విచారణ గురువారానికి వాయిదా పడింది. సాంకేతిక లోపం కారణంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడైన హెడ్లీ అప్రూవర్గా మారి గత రెండు రోజుల వీడియో కాన్ఫరెన్స్ విచారణలో ఉగ్రదాడికి సంబంధించి అనేక కీలక విషయాలను బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే.
దిల్లీ: రెండు లక్షల రూపాయలకు మించి బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే కొనుగోలుదారులు తప్పనిసరిగా వారి పాన్కార్డు వివరాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనకు నిరసనగా దేశవ్యాప్తంగా నేడు నగల దుకాణాలు బంద్ పాటిస్తున్నాయి. ఈ నిబంధన ఫలితంగా ఇప్పటికే తమ వ్యాపారం 30 శాతం మేరకు పడిపోయిందని, గ్రామాల్లోని రైతులకు పాన్కార్డులు ఎలా ఉంటాయని వ్యాపారులు అంటున్నారు.