-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
లండన్, ఆగస్టు 31: అసంఖ్యాక నక్షత్రాలు, గ్రహాలతో కూడిన మన సౌర వ్యవస్థకు ప్లానెట్-9 ముప్పు తేబోతోందా? తాజాగా జరిగిన ఓ ఖగోళ అధ్యయనాన్ని బట్టి ఈ తొమ్మిదో గ్రహం వల్ల మొత్తం సౌర వ్యవస్థకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని స్పష్టమవుతోంది. ప్లానెట్-9 అనే గ్రహం ఉందో లేదో స్పష్టంగా తెలియకపోయినా దీని ఉనికిని మాత్రం శాస్తవ్రేత్తలు గుర్తిస్తూనే వస్తున్నారు.
ఐక్యరాజ్య సమితి, ఆగస్టు 30: ప్రపంచ వ్యాప్తంగా మహిళలు, అమ్మాయిలు ఎక్కువ సమయం దేనికోసం ఖర్చు చేస్తున్నారో ఊహించగలరా? షాపింగ్ చేయడం కోసమో లేదా ఇరుగుపొరుగు వాళ్లతో కబుర్లు చెప్పడానికని చాలామంది అనుకోవచ్చు. అవేవీ కాదు, ఇంటికి అవసరమైన నీటిని సేకరించడం కోసమట. ఈ మాట ఎవరో చెప్పింది కాదు. ఐక్య రాజ్య సమితి బాలల నిధి యునిసెఫ్ జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడయిన అంశం.
మోగదీషు: సోమాలియా దేశాధ్యక్షుడి నివాసానికి సమీపంలో మంగళవారం కారు బాంబు పేలింది. దుండగుడు కారులో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు పోలీసులువెల్లడించారు. అధ్యక్షుడు హసన్ షేక్ నివాసానికి ఎదురుగా ఉన్న రెండు హోటల్స్ దెబ్బతిన్నట్లు తెలిపారు. హోటల్ వద్ద అల్షబాబ్ గ్రూప్ మిలిటెంట్లు ఉన్నట్లు సమాచారం. పేలుడు తర్వాత తుపాకీ కాల్పులు కూడా వినిపించినట్లు పోలీసులు వెల్లడించారు.
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్, అమెరికా రక్షణ మంత్రి ఆష్ కార్టర్ మిలిటరీ లాజిస్టిక్స్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ఇక మీదట యుద్ధవిమానాలు, యుద్ధనౌకల మరమ్మతులు, ఇంధన భర్తీ తదితరాల కోసం భారత సైనిక స్థావరాలను అమెరికా, అమెరికా సైనిక స్థావరాలను భారత్ వాడుకోవచ్చు.
న్యూఢిల్లీ, ఆగస్టు 29: దశాబ్దాల తరబడి కొనసాగిన సైనిక పాలన నుంచి బయటపడి సరికొత్త మార్గంలో పయనించేందుకు సిద్ధమైన మయన్మార్కు అన్నివిధాలా అండగా నిలుస్తామని భారత్ భరోసా ఇచ్చింది. మయన్మార్ అధ్యక్షుడు యు హిన్ క్యావ్తో సోమవారం న్యూఢిల్లీలో జరిపిన విస్తృత చర్చల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ హామీ ఇచ్చారు.
కొలంబో, ఆగస్టు 29: గెరిల్లా యుద్ధతంత్రం, ఆత్మాహుతి దాడులతో ఒకప్పుడు శ్రీలంకను గడగడలాడించిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టిటిఇ) వ్యవస్థాపక అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా జీవించే ఉన్నాడా? శ్రీలంకలోని కొంత మంది తమిళ జాతీయులు అవుననే అంటున్నారు.
లండన్, ఆగస్టు 29:గుండె కొట్టుకోవడం నిమిషం ఆగిపోతే..ప్రాణానికే ముప్పని బెంబేలెత్తిపోతాం. అలాంటిది..ఓ తొమ్మిది నెలల చిన్నారి గుండెను ఏకంగా పదిహేను నిముషాల పాటు వైద్యులు ఆపేశారు! అదీ ఆ చిన్నారి ప్రాణాల్ని కాపాడేందుకే...యుకెకు చెందిన నాథన్ బైర్నీ అనేక బాబుకు జన్మతః గుండెలో చిల్లు ఉంది. ఏ క్షణలోమైనా అతడి ప్రాణానికి ముప్పేనన్న భయం తల్లి దండ్రులను వెంటాడుతూనే వచ్చింది.
అడెన్, ఆగస్టు 29:యెమన్ పట్టణమైన అడెన్ సోమవారం రక్తసిక్తమైంది. ఆర్మీ రిక్రూట్మెంట్ కేంద్రంపై ఐఎస్ ఆత్మాహుతి బాంబర్ జరిపిన దాడిలో 71మంది మరణించారు.
బ్రసెల్స్ : బాంబు పేలుడుతో బెల్జియం రాజధాని బ్రసెల్స్ సోమవారం మరోసారి ఉలిక్కిపడింది. జాతీయ క్రిమినాలజీ ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలోకి వేగంగా ఒక కారు దూసుకువెళ్లి, తర్వాత పేలిపోయింది.. ఉగ్రవాదులే దాడికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. ఇటీవలె బ్రస్సెల్స్ విమానాశ్రయం, మెట్రో స్టేషన్లో భారీ పేలుళ్లు సంభవించడంతో 32 మంది మరణించారు.
ఆడెన్: యెమెన్లోని ఆడెన్ ప్రాంతంలో సైనిక శిబిరంపై ఉగ్రవాదులు సోమవారం ఆత్మాహుతి దాడికి దిగారు. ఈ దాడిలో 45 మంది పౌరులు మృతి చెందగా, 60 మంది గాయపడ్డారు. పేలుడు పదార్ధాలతో నిండిన కారుతో కాంపౌండ్ను ఢీకొట్టి ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి దిగినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు.