S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/24/2016 - 16:38

మయన్మార్‌ : మయన్మార్‌ను బుధవారం భారీ భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత 6.8గా నమోదు అయ్యింది. భూకంపం ధాటికి భవనాలు కుప్పకూలాయి. ప్రాణనష్టం, ఆస్తినష్టం తదితర వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు కోల్‌కతా, పాట్నా, గౌహతి, ఒరిసా, భువనేశ్వర్‌లో భూమి కంపించడంతో జనం భయంతో బయటు పరుగులు తీశారు.

08/24/2016 - 15:52

రోమ్‌: ఇటలీలో బుధవారం ఉదయం 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి ఇప్పటి వరకు 21 మంది మృతిచెందారు. మృతుల్లో ఎక్కువ మంది పెస్కారా డెల్‌ ట్రోంటో ప్రాంతానికి చెందినవారుగా అధికారులు గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

08/24/2016 - 11:18

ఇటలీ: సెంట్రల్ ఇటలీలో భారీ భూకంపం సంభవించి, ఇద్దరు చనిపోయారు. ఇల్లు కూలిపోవడంతో పలువురు గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైన భూకంప ప్రభావానికి అమెట్రిసే పట్టణంలో భారీగా నష్టం సంభవించి ఉండవచ్చని ప్రాథమిక అంచనా. సహాయ కార్యక్రమాలు ప్రారంభించిన ఇటలీ ప్రభుత్వం శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది.

08/24/2016 - 07:17

ఐక్యరాజ్య సమితి, ఆగస్టు 23: పాకిస్తాన్‌లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన చిరునామాలుగా భారత్ పేర్కొన్న తొమ్మిందింటిలో ఆరు సరయినవేనని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ కమిటీ నిర్ధారించింది. మిగతా మూడు అడ్రస్సుల్లో ఒకటి ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ దౌత్యవేత్త మలీహా లోధీ అడ్రసుగా ఉండడంతో దాన్ని తన జాబితానుంచి తొలగించింది.

08/23/2016 - 16:15

కరాచీ: పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు మద్దతిచ్చిన బ్రహందాగ్ బుగ్తీ, హర్బియార్, బనుక్ కరీమాపై దేశద్రోహంతో పాటు పలు సెక్షన్ల కింద ఖుజ్దర్‌లోని పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు నమోదయ్యాయి.

08/23/2016 - 00:14

నై పై డా, ఆగస్టు 22: తమ భూభాగంపై భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలను అనుమతించే ప్రశే్న లేదని మయన్మార్ సోమవారం స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మయన్మార్ పర్యటన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు యు టిన్‌కియాతోపాటు ఆ దేశ కౌనె్సలర్, విదేశాంగ మంత్రి ఆంగ్‌సాన్ సూకితో సమావేశమయ్యారు. రెండు దేశాలు ఫలవంతమైన భాగస్వామ్యం దిశగా ముందుకు వెళ్తున్నాయని టిన్‌కియా అన్నారు.

08/22/2016 - 06:30

గజియాన్‌టెప్ (టర్కీ), ఆగస్టు 21: టర్కీలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 50 మంది మృతి చెందారు. సిరియా సరిహద్దుల్లో ఉన్న ఆగ్నేయ టర్కీలోని గజియాన్‌టెప్ నగరంలో ఒక వివాహానికి హాజరైన ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగిందని అధికారులు ఆదివారం తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి అనేక మంది ఖుర్దులు హాజరయిన వివాహ కార్యక్రమంలో సంభవించినట్టు పేర్కొన్నారు.

08/22/2016 - 05:13

పక్షం రోజుల పాటు యావత్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తి అనంతమైన క్రీడానందాన్ని, అనిర్వచనీయమైన అనుభూతిని అందించిన రియో ఒలింపిక్స్‌కు ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత తెరపడింది. ఆరంభం ఎంత ఆర్భాటంగా, అట్టహాసంగా జరిగిందో..ముగింపూ అంతే కనువిందుగా ఆనందదాయకంగా ముగిసింది. దాదాపు నాలుగు గంటల పాటు ముగింపు ఉత్సవాలు దేదీప్య వెలుగుల మధ్య జరిగాయి.

08/20/2016 - 17:06

టోక్యో: జపాన్‌లో వరుసగా రెండో రోజు శనివారం భారీ భూకంపం సంభవించింది. జపాన్‌ ఉత్తర ప్రాంతంలో మియాకో నగరానికి 167కి.మీ.ల దూరంలో భూకంపం వచ్చినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. ఈరోజు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.0గా నమోదైందని అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు లేవని జపాన్‌ మెట్రోలాజికల్‌ ఏజెన్సీ స్పష్టంచేసింది.

08/19/2016 - 02:30

పురుషుల 200 మీటర్ల సెమీ ఫైనల్‌లో లక్ష్యం దిశగా దూసుకెళుతూ కెనడా రన్నర్ ఆండ్రె డి గ్రేస్‌ను ఆటపట్టిస్తున్న ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్. సెమీస్‌లో బోల్ట్ 19.78 సెకన్లలో లక్ష్యాన్ని చేరగా, గ్రేస్ 19.80 సెకన్లలో పూర్తి చేశాడు. అమెరికా అథ్లెట్ లాష్వాన్ మెరిట్ 19.94 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో ఫైనల్ పోరు శుక్రవారం జరుగుతుంది

Pages