S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/03/2016 - 06:48

లాహోర్, సెప్టెంబర్ 2: ‘పాకిస్తాన్‌కు వెళ్తే నరకానికి వెళ్లినట్లు ఉంటుంద’ని భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్‌లోని పంజాబ్ అసెంబ్లీ సభ్యులు ఖండించారు. పారికర్ వ్యాఖ్యలపై భారత రాయబారిని పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేయాలని వారు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

09/03/2016 - 05:05

లాస్ ఏంజిలిస్, సెప్టెంబర్ 2: ప్రసిద్ధ అంతర్జాతీయ నటుడు జాకీచాన్‌కు సమున్నత ఆస్కారం పురస్కారం లభించింది. సినిమా రంగానికి భిన్న కోణాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా జాకీచాన్‌కు జీవన సాఫల్య పురస్కారాన్ని అందించాలని ఆస్కార్ అకాడమీ సంకల్పించింది. నవంబర్ 12న ఈ గౌరవ పురస్కారాన్ని జాకీచాన్‌కు ప్రదానం చేస్తారు.

09/02/2016 - 17:43

చెన్నై: చెన్నైలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ తమిళనాడు గవర్నర్‌గా మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు తో ప్రమాణం చేయించారు. తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య ఆగస్టు 31న పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో విద్యాసాగర్‌రావు అదనపు బాధ్యతలు స్వీకరించారు.

09/02/2016 - 17:26

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని మర్దాన్ జిల్లా కోర్టులో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరగడంతో 12 మంది చనిపోయారు. 50 మంది గాయపడ్డారు. దాడి తమ పనే అని జమాత్ ఉర్ అహ్రార్ ప్రకటించుకుంది. మరోవైపు పెషావర్ సిటీలో శుక్రవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా కాల్పులు కలకలం సృష్టించడంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

09/02/2016 - 16:55

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం వియత్నాం పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ద్వైపాక్షిక అంశాలపై ఆ దేశంతో చర్చించనున్నారు. నాలుగో తేదీన చైనాలో జరిగే జీ-20 దేశాల సదస్సులో పాల్గొంటారు. ఐదో తేదీన లావోస్‌ వెళ్లి భారత్‌-ఆసియాన్‌, తూర్పు ఆసియా సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు.

09/02/2016 - 12:35

పాకిస్థాన్ : కైబర్ పక్తున్వ ప్రావెన్స్లో శుక్రవారం బాంబు పేలుళ్ల ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాంబు పేలుళ్లకు పాల్పడింది తామే అని ఏ ఉగ్రవాద సంస్థ నోరు మెదపలేదు.

09/02/2016 - 00:46

లండన్, సెప్టెంబర్ 1: ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాశ్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందారని 60 ఏళ్ల నాటి జపాన్ ప్రభుత్వ రహస్య పత్రాలు వెల్లడించాయి. నేతాజీ మృతిపై ఆనాటి జపాన్ ప్రభుత్వ అధికారిక రహస్య పత్రాలు గురువారం వెలుగుచూశాయి.

09/02/2016 - 00:35

వాషింగ్టన్, సెప్టెంబర్ 1: జమ్మూకాశ్మీర్, నియంత్రణ రేఖ విషయంలో యథాతథ స్థితి కొనసాగడానికే అమెరికా సానుకూలంగా ఉన్నట్లు కనపడుతోంది. అయితే శాంతి, కాశ్మీర్‌పై చర్చల పరిధి, సరళి వంటి నిర్ణయాలు భారత్, పాకిస్తాన్‌లు తీసుకోవలసినవేనని అమెరికా స్పష్టం చేసింది. ‘ఆజాద్ కాశ్మీర్’, గిల్గిట్ బాల్తిస్తాన్‌లు పాకిస్తాన్ పాలనలో ఉన్న భూభాగాలుగా మేము గుర్తించాం.

09/02/2016 - 00:35

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 1: పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మరోసారి కాశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయం చేయడానికి ప్రయత్నించారు. కాశ్మీర్ లోయలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారించడానికి ఒక నిజనిర్ధారణ మిషన్‌ను పంపించాల్సిందిగా కోరుతూ ఆయన ఐక్యరాజ్య సమితి (ఐరాస) సెక్రెటరీ జనరల్ బాన్ కి మూన్‌కు లేఖ రాశారు. నెల రోజులలోపు ఆయన ఇలా లేఖ రాయడం ఇది రెండోసారి.

09/01/2016 - 17:56

దిల్లీ: రెండు, మూడు తేదీల్లో వియత్నాంలో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాలుగో తేదీన చైనాకు వెళ్లి అక్కడ జరిగే జీ-20 దేశాల సదస్సులో పాల్గొంటారు. చైనా అధ్యక్షుడితో సమావేశమై, దక్షిణ చైనా సముద్రం విషయమై చర్చించే అవకాశం ఉంది. ఐదో తేదీని లావోస్‌ వెళ్లి భారత్‌-ఆసియాన్‌, తూర్పు ఆసియా సదస్సులో పాల్గొంటారు.

Pages