S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/23/2019 - 01:14

భారత రాజ్యాంగం ఏ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాయబడ్డదో భారత ప్రజానీకానికి అవగాహన కాకుండా చైతన్యాన్ని కలిగించుటకై ప్రతి టీచర్‌కు శిక్షణనివ్వాలి. బిఇడి కోర్సులు చేస్తున్నప్పుడు ఇలాంటి శిక్షణ ఇచ్చినట్లయితే తరగతి గదిలో దీనిని దృష్టిలో పెట్టుకుని తమ పాఠాలను చెప్పే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుల వ్యవస్థ ఎలా వచ్చింది? అది ఎంత హాని చేసింది? అస్పృశ్యత అంటే ఏమిటిది?

02/21/2019 - 03:43

‘వేలాది సంవత్సరాలపాటు ఐ దు నదుల నీరు పంజాబ్‌లో ప్రవహిస్తోంది.. నేడు ఆరవ నది మానవ రక్తంలో ప్రవహిస్తోంది.. నీటి మీద మేము ఇటుక, రాతి, ఉక్కు వంతెనలను నిర్మించాము. ఆరవ నదిపై వంతెన మానవ మృతదేహాలతో నిర్మించబడింది’- అని భారతదేశ విభజన తరువాత మనసు విరిగిన వౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఆక్రోశంతో, ఆవేదనతో అన్నారు. అబుల్ కలామ్ స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి.

02/20/2019 - 21:52

కశ్మీర్ అనగానే ఉగ్రవాదుల అరాచకాలు.. సైనికులకు, ముష్కరులకు మధ్య హోరాహోరీ కాల్పు లు.. అనే విషయాలు దశాబ్దాలుగా మనకు అనుభవం. ఉగ్రవాదుల ఉన్మాదానికి తాజాగా పుల్వామాలో జరిగిన దాడి తార్కాణం. స్వతంత్ర భారతానికి ఏడు దశాబ్దాల కాలం గడిచినా.. కశ్మీర్ సమస్య పరిష్కారం కాకపోవడానికి మన పాలకుల వైఫల్యాలే కారణాలుగా పేర్కొనాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మత రాజకీయాల ప్రాతిపదికపై పాకిస్తాన్ ఆవిర్భవించింది.

02/19/2019 - 00:06

ధర్మప్రతిష్ఠాపనే లక్ష్యంగా, కర్తవ్య పరాయణత్వ మే ధ్యేయంగా జీవించి ధన్యుడైన వారిలో నిత్యస్మరణీయుడు ఛత్రపతి శివాజీ. అందుకే ‘శివాజీ స్వరూపానే్న ధ్యానించండి, ఆయన ప్రతాపానే్న అనుష్ఠించండి’ అని సమర్థ రామదాసు వంటి మహనీయులు మన జాతికి ప్రబోధించారు. హిందూ ధ్వజాన్ని మళ్ళీ ఉత్తుంగ శిఖరాలపై ఎగురవేసి, హిందూత్వంలో అమృతాన్ని నింపి ప్రాణప్రతిష్ఠ చేసిన మహనీయుడు శివాజీ.

02/17/2019 - 00:18

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మిలటరీ ఇన్‌చార్జి సట్వాజీ అలియాస్ సుధాకర్ అలియాస్ సుధాకరణ్ అతని భార్య నీలిమతోపాటు తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోయారు. ఆయన తలపై ఝార్ఖండ్ ప్రభుత్వం కోటి రూపాయలను, నీలిమపై రూ.25 లక్షలు రివార్డులుగా ప్రకటించింది. వీరిద్దరి లొంగుబాటుతో ఆ పార్టీ క్షీణ దశ మరింత వేగవంతమైంది.

02/15/2019 - 22:01

తరగతి గదిలో ఉపాధ్యాయుడు తాను చెప్పిందే వేదం అనుకోవద్దని, తను బోధించిన ప్రతి విషయంపైన పూర్వపక్షం చేయిస్తాడు. తరగతి గదిని రెండుగా విభజిస్తాడు. తను చెప్పిన విషయాన్ని సమర్థించేవారు కొంతమంది, దాన్ని పూర్వపక్షం చేసేవాళ్లు కొంతమంది ఉంటారు. ఇది ఉపాధ్యాయుల ఆత్మపరిశీలన. తాను చెప్పేదే ఒప్పుకోవాలని కోరుకోరు. తనను పూర్వపక్షం చేసేవారిని కూడా అంతే ప్రేమిస్తారు. పూర్వపక్షం అంటే తప్పులు వెతకటం.

02/14/2019 - 01:03

ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న దేశం మనది. పరిపాలనను శాసించే ఎన్నికల ప్రక్రియలో అత్యంత ప్రాధాన్యత కలిగినది ఓటుహక్కు. ప్రభుత్వం ఏర్పాటులో అత్యంత కీలకమైన ఎన్నికల విధానం రానురానూ అపహాస్యం పాలవుతోంది. ఓటర్ల జాబితాలో చోటుచేసుకుంటున్న తప్పులు, చిత్తశుద్ధిలేని అధికారుల నిర్లక్ష్యం ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి.

02/13/2019 - 04:14

మావోయిస్టుల రాజధానిగా భావించే అబూజ్‌మడ్ అడవుల్లోకి భద్రతా బలగాలు అడుగుపెట్టాయి. ఈనెల 7న గాలింపు సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో పది మంది మావోయిస్టు గెరిల్లాలు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ప్రమాదకరమైన ఆయుధాలను, మందుగుండు సామగ్రిని పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

02/12/2019 - 00:01

మన దేశంలో అనేక వ్యవస్థలకు రాజ్యాంగ భద్రత కల్పిస్తూ వస్తున్నారు. ఈమధ్యనే ఓబీసీ కమిషన్‌కు సైతం రాజ్యాంగ భద్రత కల్పించారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జాతిపిత మహాత్మా గాంధీ ‘గ్రామ స్వరాజ్యమే నిజమైన స్వరాజ్యం’ అన్నారు. గ్రామాల స్వయంశక్తికి పంచాయతీల పాలక వర్గాలతోపాటు, ఆర్థికాభివృద్ధికి సహకార సంఘాల తోడ్పాటు వుండాలని భావించారు.

02/10/2019 - 03:18

‘‘మేము వౌనంగా ఉన్నా.. లేనిపోని రభస చేసి ఆమె మాపై అకారణంగా నేరం మోపుతుంది..’ ఈ మాటలు అన్నది ఎవరో సాదాసీదా వ్యక్తి కాదు.. సాక్షాత్తూ దివంగత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం అగ్రనేత జ్యోతిబసు.
ఇంతకూ ‘ఆమె’ ఎవరు?
ఆమే- ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో చిన్నప్పటి నుండి మానసికమైన ఒత్తిడులతో ఆమె పెరిగింది.

Pages