-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
హైదరాబాద్, అక్టోబర్ 28: తెలంగాణ రాష్ట్రంలో 5.75 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని, వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించామని రేస్ పవర్ ఇన్ఫ్రా సంస్థ డైరెక్టెర్ సంజయ్ గరుడాపల్లి తెలిపారు. ఏడు నెలల వ్యవధిలో తాము ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. కాగా, టర్న్ కీ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును రేస్ పవర్ ఇన్ఫ్రా పూర్తి చేసింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ పాల వ్యాపారాన్ని సొంతం చేసుకోనున్నట్లు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ శుక్రవారం తెలిపింది. ఈ మేరకు ఓ ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు చెప్పింది. ఈ ప్రతిపాదిత లావాదేవీకి రెగ్యులేటరీ ఆమోదాలు, ఇతరత్రా అనుమతులు రావాల్సి ఉందని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది.
ముంబయి, అక్టోబర్ 27: గత రెండు రోజులుగా నష్టాల్లో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా చాలావరకు మందకొడిగానే సాగాయి. అయితే కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలపై ఆశలు చిగురించిన నేపథ్యంలో చివరి గంటలో కొనుగోళ్ల మద్దతుతో సెనె్సక్స్ ప్రారంభ నష్టాలను పూడ్చుకుని 79 పాయిట్ల స్వల్ప లాభంతో ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ ఎలాంటి మార్పూ లేకుండా ముగిసింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ప్రభుత్వ రంగంలోని డజను పైగా సంస్థల్లో (పిఎస్యుల్లో) పెట్టుబడుల ఉపసంహరణకు నీతి ఆయోగ్ చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి వర్గం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వీటిలో లాభాలను ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి.
కొత్తగూడెం, అక్టోబర్ 27: సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న పోరాటాలకు సింగరేణి యాజమాన్యంతోపాటు రాష్ట్రప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో రెండు రోజులు టోకెన్ సమ్మె నిర్వహించాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జెఎసి నిర్ణయించింది.
తడ/సత్యవేడు, అక్టోబర్ 27: జపాన్లోని టొయామో స్టేట్కు చెందిన 15 మంది అత్యున్నత శ్రేణి ప్రతినిధుల బృందం గురువారం శ్రీసిటి సెజ్ను సందర్శించింది. టొయామో స్టేట్ గవర్నమెంట్ అర్బన్ కమర్షియల్ డెవలప్మెంట్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఒహోషి యుటాకా నేతృత్వంలో విచ్చేసిన వీరికి శ్రీసిటి అధ్యక్షులు సతీష్ కామత్ సాదరంగా స్వాగతం పలికి ఇక్కడ వౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతిని వివరించారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ప్రభుత్వ రంగ చమురు అనే్వషణ సంస్థ ఒఎన్జిసి నికర లాభాలు రెండో త్రైమాసికంలో ఆరుశాతం పెరిగాయి. కాగా, కంపెనీ తన లిక్విడిటీని పెంచుకోవడం కోసం ప్రతి రెండు షేర్లకు ఒక బోనస్ షేరును ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 6.2 శాతం పెరిగింది.
ముంబయి, అక్టోబర్ 27: టాటాగ్రూపులోని కొన్ని కంపెనీలు భారీ నష్టాల్లో ఉన్నాయంటూ గ్రూపు చైర్మన్ పదవినుంచి అర్ధంతరంగా తొలగించిన సైరస్ మిస్ర్తి చేసిన ప్రకటనతో వరసగా మూడో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లో ఆ గ్రూపునకు చెందిన కంపెనీల షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా ఈ వారంలో ఆ గ్రూపునకు చెందిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.26,000 కోట్లు పడిపోయింది.
ముంబయి, అక్టోబర్ 27: టాటా గ్రూపు చైర్మన్ పదవినుంచి అనూహ్య రీతిలో ఉద్వాసనకు గురయిన సైరస్ మిస్ర్తి తనను కీలుబొమ్మ చైర్మన్గా చేశారంటూ గ్రూపు యాజమాన్యంపై చేసిన ఆరోపణలను టాటా సన్స్ గురువారం తోసిపుచ్చుతూ గ్రూపు కంపెనీల నిర్వహణకు సంబంధించి మిస్ర్తికి పూర్తి అధికారాలు ఇచ్చామని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆయన బోర్డు విశ్వాసాన్ని కోల్పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: చైనానుంచి కుప్పలు తెప్పలుగా బాణసంచా వచ్చి పడ్డాయన్న వార్త దేశ రాజధానిలో ఆ వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. దేశంకోసం చైనా బాణసంచా కొనరాదంటూ జరిగిన ప్రచారం ప్రజల్లో బాగా ప్రభావం చూపించింది. చివరకు స్వదేశీ టపాకాయలు అమ్ముతున్నా నమ్మలేని పరిస్థితి నెలకొంది. తాము చైనా బాణసంచా అమ్మటం లేదని బోర్డులు పెట్టినా కొందరు ఆ మాటల్ని వినటం లేదు.