-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూఢిల్లీ, మే 12: రియో ఒలింపిక్స్లో పోటీపడేందుకు వీలుగా నర్సింగ్ యాదవ్తో ట్రయల్ బౌట్కు తాను సిద్ధంగా ఉన్నానని స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ అన్నాడు. అయితే, రియోకు తనను పంపాలని డిమాండ్ చేయడం లేదని స్పష్టం చేశాడు. పురుషుల 74 కిలోల విభాగంలో భారత్ నుంచి ఒక రెజ్లర్కు ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
బోల్టన్, మే 12: భారత బాక్సర్ విజేందర్ సింగ్ శుక్రవారం జరిగే ప్రొఫెషనల్ ఫైట్లో పోలండ్కు చెందిన అడ్రెజ్ సోల్డ్రాను ఢీకొనేందుకు సిద్ధమయ్యాడు. ఎనిమిది రౌండ్లు జరిగే ఈ ఫైట్లో విజయం తనదేనని సోల్ట్రా వ్యాఖ్యానించగా, వరుసగా ఐదు ఫైట్స్లో నెగ్గిన తాను ఆరో విజయాన్ని సాధిస్తానని విజేందర్ ధీమా వ్యక్తం చేశాడు.
హైదరాబాద్, మే 12: వరుస విజయాలతో ఊపుమీద ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్కు ఢిల్లీ డేర్డెవిల్స్ షాకిచ్చింది. గురువారం జరిగిన ఐపిఎల్ గ్రూప్ మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్కు దిగి, 20 ఓవర్లలో 146 పరుగులు చేసిన సన్రైజర్స్ ఆతర్వాత డేర్డెవిల్స్ను నిలువరించలేకపోయింది.
వలెన్షియా, మే 12: సాకర్ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న లియోనెల్ మెస్సీ ఖాతాలో మరో రికార్డు చేరింది. బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ అర్జెంటీనా సూపర్ స్టార్ స్పానిష్ సాకర్ లీగ్ ‘లా లిగా’లో భాగంగా ఎస్పానియల్తో జరిగిన మ్యాచ్లో ఫ్రీ కిక్ ద్వారా ఒక గోల్ చేశాడు. ఈ ఏడాది అతను ఫ్రీ కిక్ను సద్వినియోగం చేసుకోవడం ఇది ఏడోసారి.
న్యూఢిల్లీ, మే 12: రెండు పర్యాయాలు ఐపిఎల్ చాంపియన్షిప్ను కైవసం చేసుకున్న కోల్కతా నైట్ రైడర్స్ గాయపడిన జాన్ హాస్టింగ్స్ స్థానంలో షాన్ టైట్ను తీసుకుంది. కాలి మడమ గాయం కారణంగా హాస్టింగ్స్ ఈ టోర్నీకి దూరమయ్యాడు. దీనితో మరో ఆటగాడితో ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపిఎల్ వేలంలో 33 ఏళ్ల టైటిల్ను ఎవరూ కొనుగోలు చేయలేదు.
కరాచీ, మే 12: ఆటగాళ్ల భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకొని జింబాబ్వే మినహా టెస్టు హోదాగల ఏ ఒక్క జట్టూ తమ దేశంలో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో కుదేలైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఆర్థికంగా నష్టపోయింది. దివాలా పరిస్థితులను ఎదుర్కొంటున్నది. అయితే, పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్ఎల్)తో తమకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని పిసిబి అధికారులు అంటున్నారు.
బెంగళూరు, మే 11: ఈసారి ఐపిఎల్ను నిష్క్రమించడం దాదాపు ఖాయమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హోం గ్రౌండ్లో బుధవారం డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ చేతిలో ఓడింది. లోకేష్ రాహుల్ అర్ధ శతకంతో రాణించడంతో 20 ఓవర్లలో బెంగళూరు నాలుగు వికెట్లకు 151 పరుగులు చేయగలిగింది. ముంబయి ఈ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే, ఆరు వికెట్ల తేడాతో ఛేదించింది.
లండన్, మే 11: మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. అయితే, అదృష్ట వశాత్తు ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. వెస్ట్ హామ్ యునైటెడ్తో మ్యాచ్ జరిగిన తర్వాత అభిమానులు నిరసన ప్రదర్శనకు దిగి, మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
హైదరాబాద్, మే 11: మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ నాయకత్వంలోని ఢిల్లీ డేర్డెవిల్స్ను డేవిడ్ వార్నర్ కెప్టెన్గా సేవలు అందిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ భయపెడుతున్నది. ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే కీలక మ్యాచ్లో సన్రైజర్స్ను ఓడిస్తేనే డేర్డెవిల్స్ నాటౌట్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓడితే, మిగతా మ్యాచ్ల్లో తప్పక గెలవడంతోపాటు, ఇతర జట్ల ఫలితాలపై డేర్డెవిల్స్ నాటౌట్ అవకాశాలు ఆధారపడతాయి.
రోమ్, మే 11: తాను ఫామ్లోనే ఉన్నానని, ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్తో పోరుకు సిద్ధమని రోమ్ మాస్టర్స్ టోర్నీలో పాల్గొంటున్న మాజీ నంబర్ వన్ రాఫెల్ నాదల్ అన్నాడు. అయితే, జొకోవిచ్తో తన మ్యాచ్ ఇప్పుడే కాదుకదా అని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. గాయం సమస్య చాలా వరకు నయమైందని, ఫిలిప్ కొల్చెర్బెర్తో జరిగే రెండో రౌండ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదుచూస్తున్నానని నాదల్ అన్నాడు.