-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూయార్క్, సెప్టెంబర్ 11: జర్మనీ టెన్నిస్ స్టార్ ఏంజెలిక్ కెర్బర్ యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆమె చెక్ రిపబ్లిక్కు చెందిన పదోసీడ్ కరోలినా ప్లిస్కోవాను 6-3, 4-6, 6-4 తేడాతో ఓడించి, కెరీర్లో రెండో గ్రాండ్ శ్లామ్ టైటిల్ను సంపాదించుకోవడమేగాక, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ను అందుకుంది.
గ్రేటర్ నోయిడా, సెప్టెంబర్ 11: ఇండియా రెడ్తో ఆదివారం ప్రారంభమైన ఐదు రోజుల దులీప్ ట్రోఫీ క్రికెట్ ఫైనల్ మొదటి ఇన్నింగ్స్ను ఇండియా బ్లూ ఆరు వికెట్లకు 693 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. చటేశ్వర్ పుజారా డబుల్ సెంచరీతో రాణించగా, షెల్డన్ జాక్సన్ శతకాన్ని నమోదు చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా బ్లూకు మాయాంక్ అగర్వాల్, కెప్టెన్ గౌతం గంభీర్ చక్కటి ఆరంభాన్నిచ్చారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్ శశాంక్ మనోహర్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఐసిసి నుంచే వచ్చే వాటాను వదులుకునే ప్రసక్తే లేదని ఠాకూర్ తేల్చిచెప్పడం ఇప్పుడు మనోహర్ను ఇరకాటంలోకి నెట్టింది.
మాడ్రిడ్, సెప్టెంబర్ 11: స్పానిష్ సాకర్ లీగ్ లా లిగాలో భాగంగా అలావెస్తో తలపడిన బార్సిలోనాకు చుక్కెదురైంది. లియోనెల్ మెస్సీ, లూయిస్ సౌరెజ్ వంటి మేటి ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన కోచ్ లూయిస్ ఎన్రిక్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. 1-2 తేడాతో బార్సిలోనా పరాజయాన్ని చవిచూసింది. మ్యాచ్ 39వ నిమిషంలో బ్రుమ్ సిల్వ అకోస్టా ద్వారా అలావెస్కు తొలి గోల్ లభించింది.
కరాచీ, సెప్టెంబర్ 11: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో వెస్టిండీస్తో జరిగే హోం సిరీస్లో ఆడే పాకిస్తాన్ జట్టుకు మాజీ కెప్టెన్ వసీం బారీని మేనేజర్గా నియమించారు. ప్రస్తుత మేనేజర్ ఇంతికాబ్ ఆలమ్ కాంట్రాక్టు ఈనెల 30వ తేదీతో ముగుస్తుందని, అందుకే, విండీస్తో జరిగే సిరీస్కు బారీని ఆ స్థానంలో నియమిస్తున్నామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఒక ప్రకటనలో తెలిపింది.
లక్నో, సెప్టెంబర్ 11: క్రికెటర్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ద్వారా తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించాడు. ఉత్తర ప్రదేశ్ మఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను కలుసుకొని, చర్చించిన తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు అతను తెలిపాడు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు అతను నేరుగా సమాధానం చెప్పలేదు.
రియో డి జెనీరో, సెప్టెంబర్ 10: పారాలింపిక్స్లో భారత్ బోణీ చేసింది. మరియప్పన్ తంగవేలు పురుషుల టి-42 హైజంప్ విభాగంలో స్వర్ణ పతకాన్ని అందించాడు. అతను 1.89 మీటర్ల ఎత్తును పూర్తి చేసి, అగ్రస్థానంలో నిలవగా, వరుణ్ సింగ్ భాటి 1.86 మీటర్లతో కాంస్య పతకాన్ని అందుకున్నాడు.
చెన్నై, సెప్టెంబర్ 10: మంచి ఉద్యోగం సంపాదించుకోవడం, తన కోసం ఎంత కష్టపడిన తల్లిని జాగ్రత్తగా చూసుకోవడం అన్నవే ప్రస్తుతానికి తన ముందు ఉన్న లక్ష్యాలని రియో పారాలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన హైజంపర్ మరియప్పన్ తంగవేలు అన్నాడు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: మరియప్పన్ తంగవేలు సాధించిన విజయం దేశానికి గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. రియో పారాలింపిక్స్ పురుషుల హైజంప్ టి-42 విభాగంలో తంగవేలు స్వర్ణ పతకం సాధించడం యావత్ దేశాన్ని ఆనందంలో ముంచెత్తిందని పేర్కొన్నారు. ఇదే విభాగంలో కాంస్య పతకాన్ని గెల్చుకున్న వరుణ్ భాటిని కూడా ఆయన అభినందించారు.