రాష్ట్రీయం
దర్యాప్తునకు మూడు బృందాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 September 2019
హైదరాబాద్: కోడెల మృతిపై భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పోస్టుమార్టం పూర్తి నివేదిక అనంతరమే ఆయన మృతిపై స్పష్టత వస్తుందని అన్నారు. దర్యాప్తు చేయడానికి మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు ఆయన వెల్లడించారు. కోడెల మృతిని అనమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశామని సీపీ తెలిపారు.
*చిత్రం... కోడెల మరణ వార్త విని హైదరాబాద్లోని బసవ తారకం కేన్సర్ ఆసుపత్రికి తరలివచ్చిన అభిమానులు