-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే భేటీ అయ్యారు. ఉదయం ఆయన రాష్టపతి భవన్కు వెళ్లి ఆయనతో చర్చించారు. భారత్లో మూడు రోజుల పర్యటన నిమిత్తం షింజో అబే నిన్న దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే.
కర్నాటక: బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో అదుపుతప్పిన కారు చెట్టుకు ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులు మృతిచెందారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు.
ఢిల్లీ: ఢిల్లీలో మైనర్బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీలోని దిచావన్ ప్రాంతంలో 14ఏళ్ల మైనర్ బాలిక పాఠశాలకు వెళ్తుండగా.. కొందరు వ్యక్తులు కారులో వచ్చి అపహరించారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీః జపాన్ సహకారంతో ముంబాయి- అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. శనివారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో జపాన్ ప్రధాని షింజోఅబేతో మోదీ భేటీ అయ్యారు. అనంతరం సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇరు దేశాల మధ్య కుదురిన పలు ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు పేర్కొన్నారు.
అగర్తల : ఇటీవల త్రిపురలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అగర్తల మున్సిపాలిటీ కార్పొరేషన్ రెండు స్థానాల్లో సిపిఎం గెలుపొందింది. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమ త్రిపురలో జిరానియా నగర పంచాయతీని అధికార కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నేతృత్వంలోని వామపక్ష కూటమి ఇప్పటికే కైవసం చేసుకోగా.. అనేక స్థానాల్లో లెఫ్ట్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఓవైపు పర్యావరణానికి హాని చేయని విద్యుత్కు కట్టుబడి ఉంటూనే మరోవైపు తన అభివృద్ధి లక్ష్యాలను సాధించుకోవడం అనేది భారత దేశానికి పెద్ద బాధ్యతే కాక సవాలు కూడానని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ‘ప్రపంచ జనాభాలో 17 శాతం భారత్లో ఉంది. అయినప్పటికీ దాని ఇంధన, విద్యుత్ వినియోగం ప్రపంచ వినియోగంలో దాదాపు అయిదు శాతంగా మాత్రమే ఉంది’ అని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తిదారు నెస్లే ఇండియాకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రమాణాలకు లోబడే ఉత్పత్తి అవుతున్నట్టు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఇన్స్టెంట్ నూడుల్స్గా ప్రాచుర్యం పొందిన మ్యాగీలో సీసం, ఎంఎస్జిలు అధికంగా ఉన్నట్టు తేలడంతో దేశ వ్యాప్తంగా వాటిని నిషేధించారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఎన్డిఏ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపునకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ సభ్యుల శుక్రవారం వరుసగా నాలుగో రోజు సృష్టించిన గొడవ, గందరగోళం మూలంగా పార్లమెంటు ఉభయ సభలు స్తంభించిపోయాయి. రాజ్యసభ పూర్తిగా స్తంభించిపోగా లోక్సభ మాత్రం ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేయటంతో సజావుగా కొనసాగింది.
న్యూఢిల్లీ/వారణాసి, డిసెంబర్ 11: భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహిత మిత్రుడిగా భావిస్తున్న జపాన్ ప్రధాని షింజో అబే మూడు రోజుల పర్యటనార్థం శుక్రవారం భారత్ చేరుకున్నారు. ఆయన పర్యటన కాలంలో ఇరు దేశాల మధ్య అనేక కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. 98వేల కోట్ల రూపాయలతో చేపట్టే తొలి బులెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణం ఈ ఒప్పందంలో కీలకమైంది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ప్రత్యేక హోదా కల్పించవలసిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్తోపాటు రాజస్థాన్, బీహార్, చత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు అందాయని ప్రణాళిక వ్యవహారాల మంత్రి జితేందర్ సింగ్ వెల్లడించారు. వైకాపా సభ్యుడు వైఎస్ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా శుక్రవారం లోక్సభలో ఈ విషయం తెలిపారు.