-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
తిరువనంతపురం, జనవరి 9: బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకుపోవడానికి మతతత్వ అజెండాను అమలు చేయడంతోపాటు కేంద్రీకృత రాజ్య నిర్మాణానికి పూనుకుంటోందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ప్రజలు ఈ రెండు సవాళ్లకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
పఠాన్కోట్, జనవరి 9: పఠాన్కోట్ ఎయిర్బేస్పై గత శనివారం దాడిచేసిన ఉగ్రవాదులను తుదముట్టించడంలో భద్రతాదళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలను చూసి గర్విస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం పఠాన్కోట్ ఎయిర్బేస్ను సందర్శించి తాజా పరిస్థితిని సమీక్షించారు.
న్యూఢిల్లీ/శ్రీనగర్, జనవరి 9: జమ్మూ-కాశ్మీర్లో శనివారం రాత్రి గవర్నర్ పాలన విధించారు. ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సరుూద్ మరణం అనంతరం ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో గవర్నర్ పాలన విధించినట్లు కేంద్ర హోం శాఖ అధికార ప్రతినిధి ఒకరు ఢిల్లీలో వెల్లడించారు.
పాట్నా : బీహార్ రాష్ట్రంలో బక్సర్ ప్రాంతానికి చెందిన ఏఎస్ఐ అశోక్ కుమార్ యాదవ్ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. అతని మృతదేహం ఈరోజు వైశాలి జిల్లాలో లభ్యమైనట్లు అక్కడి పోలీసులు చెప్పారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.
కర్ణాటక: హస్సాన్ జిల్లాలో సెలవులకని పది మంది యువకులు ఎస్యూవీ వాహనంలో చిక్మాగలూర్కి వెళుతుండగా.. ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి.. నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సతీష్(24), దిలీప్(24), జయంత్(23), శివస్వామి(24), జనార్థన్(22), కార్తీక్(24), రాజు(24)లు మృతిచెందగా.. మరో ముగ్గురు ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీరంతా బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
పఠాన్ కోట్: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరిన మోదీ పఠాన్ కోట్ చేరుకున్నారు. ఇటీవల ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడి ఘటనను ఆర్మీ, ఉన్నతాధికారులు.. మోదీకి వివరించారు. ఎయిర్ బేస్ ను మోదీ పరిశీలించారు.
న్యూఢిల్లీ, జనవరి 8: ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగిన వారిని ఏరివేసేందుకు జరుగుతున్న ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం జరుపుతున్న ఆపరేషన్లో తాజాగా మరో అరెస్టు జరిగింది. అల్ఖైదాతో సంబంధాలు నెరపుతున్నాడన్న అనుమానంతో బెంగళూరు మదర్సాలో టీచర్గా పనిచేస్తున్న వౌలానా అంజర్ షా అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
లక్నో, జనవరి 8: దమ్ముంటే అయోధ్యలో రామాలయం నిర్మాణం చేపట్టాలని ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాది పార్టీ బిజెపిని సవాలు చేసింది. అంతేకాదు వివాదాస్పద స్థలంలో ఒక్కరాయిని పెట్టడానికి కానీ, తొలగించడానికి కానీ రాష్ట్రప్రభుత్వం అనుమతించబోదని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, జనవరి 8: పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ శుక్రవారం పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్పై జరిపిన దాడిని గొప్పగా ప్రకటించుకోవడమే కాకుండా కాశ్మీర్లో వందలాది మంది నిరాయుధులైన ముస్లింలను చంపిన భారత్ ఇప్పుడు తన సొంత సైనికుల శవాలను లెక్క పెట్టుకొంటోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
న్యూఢిల్లీ, జనవరి 8: అధిక బోనస్ అందుకోవాలన్న కార్మికుల కల వాస్తవరూపం దాల్చింది. దీనికి సంబంధించిన కొత్త బోనస్ చెల్లింపు చట్టంను ప్రభుత్వం ఈ నెల 1న గజెట్లో నోటిఫై చేసింది. దీంతో నెలకు 21 వేలకన్నా తక్కువ జీతం ఉన్న కోట్లాది మంది వేతన జీవులకు ప్రయోజనం చేకూరుతుంది. బోనస్ చెల్లింపు(సవరణ) బిల్లు 2015ను ఇటీవల ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ చట్టం బోనస్ అర్హతను రూ.