-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, జనవరి 21: ఈ ఏడాది ఏప్రిల్ నాటికల్లా తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయడం జరుగుతుందని కేంద్ర ఆహార మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ గురువారం చెప్పారు. ఇప్పటివరకు 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ చట్టాన్ని అమలు చేశాయని, మరో 11 రాష్ట్రాలు అమలు చేసే ప్రక్రియలో ఉన్నాయని ఆయన చెప్పారు.
న్యూఢిల్లీ, జనవరి 21: గణతంత్ర దినోత్సవ వేడుకలకు కనీవినీ ఎరుగని భద్రత కల్పిస్తున్నారు. 67వ రిపబ్లిక్డే వేడుకలను భగ్నం చేయడానికి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కుట్రపన్నిందన్న ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరికల నేపథ్యంలో పూర్తి అప్రమత్తత పాటిస్తున్నారు.
పఠాన్కోట్లోని వైమానిక కేంద్రంపై జరిగిన దాడికి సంబంధించి కుట్రపన్నిన వారిపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవల్సిందేనని భారత్ తెగేసి చెప్పింది. ఈ దాడికి సంబంధించి పాకిస్తాన్లో జరుగుతున్న దర్యాప్తు తీరును తాము లోతుగా పరిశీలిస్తున్నామని విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ గురువారం ఇక్కడ స్పష్టం చేశారు.
చెన్నై: చెన్నై తీరంలో నావికాదళ పడవ నీటమునిగింది. పడవలో మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ఘటనపై నావికాదళం విచారణకు ఆదేశించింది.
తిరువనంతపురం: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ప్రతిష్టాత్మక నిశగంధీ పురస్కారాన్ని పొందారు. కేరళ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్చాందీ ఇళయరాజాకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. నిశగంధీ అవార్డు కింద రూ.1,50లక్షల నగదుతోపాటు జ్ఞాపిక, కాంస్య ప్రతిమను అందజేశారు.
న్యూఢిల్లీ : బీజేపీ పాలనలో దేశంలో దళితులకు భద్రత లేకుండా పోయిందని ఆప్ నేత అశుతోష్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందుత్వ వాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువరించి తీరాలని అన్నారు.
ముంబయి: రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ ముంబయిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) గురువారం ర్యాలీ నిర్వహించింది. బీజేపీ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా పని చేస్తోందంటూ మండిపడింది. కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయలు తమ పదవులకు రాజీనామా చేయాలంటూ ఎన్సీపీ డిమాండ్ చేసింది.
ఢిల్లీ :దేశ రాజధాని ఢిల్లీలో మయూర్ విహార్ ప్రాంతంలో గురువారం ఓ వ్యక్తి రిక్షాలో సూట్కేస్ వదిలి పారిపోయాడు. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు అప్రమత్తంగా ఉన్న సంగతి తెలిసిందే. పోలీసులు రిక్షాను చుట్టుముట్టి సూట్కేస్ తెరిచి చూసి నిర్ఘాంతపోయారు. అందులో ఓ మహిళ మృతదేహం ఉంది.
చెన్నై: సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు క్రీడపై విధించిన నిషేధంపై ఈరోజు తమిళనాడు అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని, సత్వరమే ఈ సమస్యను పరిష్కరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రశ్నోత్తరాల తర్వాత కూడా డీఎంకే జల్లికట్టుపై చర్చించేందుకు స్పీకర్ను అనుమతి కోరగా.. స్పీకర్ అనుమతించలేదు.
కోల్ కతా: సుభాష్ చంద్రబోస్ అన్న కుమారుడు, మాజీ ఎంపీ సుబ్రతా బోస్ మృతి చెందారు. దక్షిణ కోల్ కతాలోని తన నివాసంలో సుబ్రతా బోస్ గతరాత్రి గుండెపోటుతో మరణించినట్లు సన్నిహితులు వెల్లడించారు. సుబ్రతా బోస్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ ఎంపీగా ఆయన 2004 నుంచి 2009 వరకూ పని చేశారు.