S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/15/2018 - 05:29

శంకరపట్నం, మే 14: శంకరపట్నం (మం) గద్దపాకలో సోమవారం ఇదే గ్రామానికి చెందిన రాచర్ల యాదగిరికి సంబంధించిన ట్రాక్టర్ సమీపంలో ఉన్న విద్యుత్ స్థంభం విరిగి ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై పడడంతో షాట్ సర్క్యూట్ ఏర్పడి స్వామికి చెందిన గడ్డివాము దగ్ధమై ట్రాక్టర్ సైతం దగ్ధమైనట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు మూడు లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు గ్రామస్థులు తెలిపారు.

05/15/2018 - 05:04

జూలూరుపాడు, మే 14: మండల పరిధిలోని సాయిరాం తండా వద్ద తల్లాడ, కొత్తగూడెం ప్రధాన రహదారిపై సోమవారం తెల్లవారు జామున వ్యాను ఢీకొనటంతో 4గు గేదెలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం జూలూర్‌పాడ్ నుండి కొత్తగూడెం వైపు వెళుతున్న కోళ్ల వ్యాను రోడ్డుదాటుతున్న గేదేలను వేగంగా ఢీకొట్టటంతో నాలుగు గేదెలు మృతి చెందాయి.

05/15/2018 - 04:27

గురజాల, మే 14: పిడుగుపాటుకు గురై ముగ్గురు విద్యార్థులు మృత్యువాతకు గురికావడంతో తల్లి దండ్రులు, బంధువుల రోదనలు ఆసుపత్రి ప్రాంగణంలో దద్ధరిల్లింది.

05/15/2018 - 04:21

చౌటుప్పల్, మే 14: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులోని ఎల్‌ఎన్‌ఎస్ క్రషర్ మిల్లులో సోమవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

05/15/2018 - 04:15

విస్సన్నపేట, మే 14: కృష్ణా జిల్లా విస్సన్నపేట - నూజివీడు రోడ్డులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సెయింట్ థెరిస్సా బాలికోన్నత పాఠశాల వద్ద ఆటో, లారీ ఎదురెదురుగా ఢీకొనటంతో ఈ దుర్ఘటన జరిగింది. ఆటోడ్రైవర్ దుక్కిపాటి రాజారావు(40), ప్రయాణికురాలు జుంజునూరి లక్ష్మీకాంతమ్మ(42), నెల నిండని పసికందు అక్కడికక్కడే మృతి చెందారు.

05/15/2018 - 03:46

కీసర, మే 14: ఇంజనీరింగ్ కళాశాల బస్సు చక్రాల క్రింద పడి బాలుడు మృతి చెందిన సంఘటన అహ్మద్‌గూడ గ్రామంలో చోటు చేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం అహ్మద్‌గూడ గ్రామానికి చెందిన సంగని ఆనంద్‌బాబు, జయ కుమారుడైన లక్ష్మీదీపక్ (7) ఒకటవ తరగతి చదువుతున్నాడు.

05/15/2018 - 03:37

హైదరాబాద్/శంకర్‌పల్లి మే 14 : సంచలనం సృష్టించిన డిగ్రీ విద్యార్ధిని శిరీష హత్య కేసులో నిందితుడు సాయప్రసాద్‌కు సహకరించిన అతని స్నేహితుడు షేఖ్ అబ్దుల్ మజీద్‌ను రెండో నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు స్థానిక శంకర్‌పల్లి సీఐ శశాంక్‌రెడ్డి తెలిపారు. సోమవారం సీఐ స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేఖరులకు ఆ వివరాలను వెల్లడించారు.

05/15/2018 - 03:32

బచ్చన్నపేట, మే 14: రోడ్డు ప్రమాదంలో ఓ యువకునికి కడుపులో ఇనుప చువ్వలు దిగి ప్రాణాపాయ స్థితిలోకి చేరిన సంఘటన సోమవారం జనగామ జిల్లా పోచన్నపేట శివారు గ్రామం కాశీనగర్ దాటిన తరువాత ఆలేరు సరిహద్దున జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ బోడుప్పల్ దేవేందర్ నగర్ కాలనీకి చెందిన గోపాల్‌దాస్ సుమన్ ఆదివారం పోచన్నపేటలో జరిగిన దుర్గామాత తిరుగువారం ఉత్సవాలకు స్నేహితుల ఇంటికి వచ్చాడు.

05/15/2018 - 03:29

హైదరాబాద్, మే 14: ఆంధ్రప్రదేశ్ పునర్వభజన చట్టంపై ఇప్పటికే దాఖలు అయిన ఫిటీషన్‌లో మీరుకూడా సభ్యులు గా చేరండని ఆంధ్రా జెఎసి చైర్మన్ సుంకర కృష్ణమూర్తి,రవీందర్‌రెడ్డిలకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. పొంగులేటి సుధాకర్‌రెడ్డి వేసిన కేసులో మీరు ఇంప్లీడ్ కావాలని న్యాయస్థానం ఆదేశించింది.

05/15/2018 - 02:19

న్యూఢిల్లీ, మే 14: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంకు సంబంధించి నీరవ్ మోదీపై సీబీఐ ఛార్జ్‌షీటు దాఖలు చేసింది. ఈ స్కామ్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ చీఫ్, ప్రస్తుతం అలహాబాద్ బ్యాంకు సీఈఓగా ఉన్న అనంతసుబ్రహ్మణ్యం, ఎండి ఇతర అధికార్ల పేర్లను కూడా సిబీఐ చార్జషీటులో చేర్చింది.

Pages