S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/13/2018 - 01:38

మదనపల్లె, జూలై 12: ఓ చిన్నారి బాలుడి హత్యకేసులో జీవిత ఖైదు శిక్షతో ఈనెల 10న మదనపల్లె సబ్‌జైల్‌లో ఉన్న ముద్దాయి గురువారం వేకువజామున ప్రాంతంలో సబ్‌జైల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి కథనం మేరకు.. చిత్తూరు జిల్లా కురబల కోట మండల కేంద్రంలో మస్తాన్ వలీ అదే ప్రాంతానికి చెందిన షబీనాతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు.

07/12/2018 - 06:20

చల్లపల్లి, జూలై 11: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఇంటి నుండి గెంటేస్తే అప్పుగా తీసుకున్న రూ.4లక్షలు తిరిగి ఇవ్వాలని కన్న తండ్రిని ప్రియుడితో కలిసి కర్కశంగా కడతేర్చిన కన్న కూతురి నిర్వాకమిది. అక్రమ సంబంధం ముందు రక్త సంబంధం ఓ లెక్కా అనుకున్న ఓ కన్నకూతురు నిర్భయంగా, నిర్దయగా సాగించిన హత్యాకాండకు ఆ తండ్రి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.

07/12/2018 - 05:47

ఘట్‌కేసర్, జూలై 11: రైలు కింద పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధి యంనంపేట్ సమీపంలో పోచారం ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న వినోద్(25) బుధవారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు.

07/11/2018 - 04:34

హుస్నాబాద్, జూలై 10: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఏఈ రాజేశం మంగళవారం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హుస్నాబాద్ అరెపల్లికాలనీలోని 16 వార్డులో రూ. 22లక్షల మురికి కాలువ నిర్మాణం పనులకు సంబంధించి ఎంబి రిక్డాలు చేసేందుకు సదరు కాంట్రాక్టర్‌ను 20 వేలు ఇస్తేనే ఎంబీ రికార్డు చేస్తానని ఏఈ రాజేశం డిమాండ్ చేశాడు.

07/11/2018 - 02:54

కురబలకోట, జూలై 10: చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని జంగావారిపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరమ్మతులకు గురై నిలిచి ఉన్న ఐషర్ లారీని మోటార్‌సైకిల్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బుడ్డారెడ్డిగారిపల్లెకు చెందిన చంద్రశేఖర్ (48) నగరి మునిసిపల్ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్నారు.

07/11/2018 - 02:53

కర్నూలు, జూలై 10: ఓ వ్యక్తి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకున్న ఓర్వకల్లు ఎంపీడీఓ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ రజాక్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఎన్.కొంతలపాడు గ్రామానికి చెందిన పి.తిరుమలేష్ తన భార్య పేర రుణం కోసం ఎస్సీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు.

07/11/2018 - 02:31

హైదరాబాద్, జూలై 10: సాంస్కృతిక శాఖలో ఇటీవల జరిగిన నియామకాలను రద్దుచేసి, పునర్నియమించాలని రాష్ట్ర హైకోర్టు తెలంగాణ సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్‌ను ఆదేశించింది. సాంస్కృతిక శాఖలో నియామకాలు మళ్లీ జరపాలని హైకోర్టు పేర్కొంది. సాంస్కృతిక శాఖలో జరిగిన నియామకాలపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు సాంస్కృతిక శాఖలో నియామకాలు పారదర్శకంగా లేవని తెలిపింది.

07/11/2018 - 01:22

న్యూఢిల్లీ, జూలై 10: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారాలు లేవంటూ తీర్పు ఇచ్చినా, సరిగా అమలు కావడం లేదంటూ ఢిల్లీప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను వచ్చే వారం విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మివ్రా, జస్టిస్ ఏఎం ఖాన్వికర్, జస్టిస్ డవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

07/11/2018 - 01:21

మధురై, జూలై 10: వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం తమిళ భాషలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు ఉపశమనం కలిగించే విధంగా మధురైన హైకోర్టు బెంచి ఆదేశాలు జారీ చేసింది. తమిళంలో ఉన్న నీట్ పరీక్షలో 49 తప్పులు దొర్లాయి. ఒక్కో తప్పుకు 4 మార్కులు చొప్పున మొత్తం 196 మార్కులు కేటాయించాలని హైకోర్టు సీబీఎస్‌ఈని ఆదేశించింది.

07/11/2018 - 01:04

పామిడి, జూలై 10: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున బెంగళూరు వెళ్తున్న కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలులో చోరీ జరిగింది. ఓ ప్రయాణికురాలి నుంచి మూడు తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. పామిడి-రామరాజుపల్లి స్టేషన్ల మధ్య దుండగులు కేబుల్ వైరును కత్తిరించడంతో రైలు నిలిచిపోయింది.

Pages