-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
అమలాపురం, అక్టోబర్ 26: విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధ్యక్షుడు, విపక్ష నాయకుడు జగన్పై హత్యాయత్నానికి పాల్పడిన జనిపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను సిట్ అధికారుల బృందం శుక్రవారం సుదీర్ఘంగా విచారించింది.
మేడ్చల్, అక్టోబర్ 26: విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడి తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సైబరాబాద్ షీ టీం డీసీపీ అనసూయ సూచించారు. మండలంలోని కండ్లకోయ గ్రామ పరిధి సీఎంఆర్ ఫార్మసీ కళాశాలలో శుక్రవారం సైబరాబాద్ కమిషనరేటు కళాజాత బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు ర్యాగింగ్ భూతంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాజేంద్రనగర్, అక్టోబర్ 26: కిడ్నాప్కు గురైన బాలుడిని ఒక్క రోజులో పట్టుకున్నారు. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రుక్మిణిదేవీ గత ఏడు సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చి జీవనం సాగిస్తున్నారు. కాగా రుక్మిణిదేవీ కుమారుడు 12 సంవత్సరాల బాలుడు రవి బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు.
భీమ్గల్, అక్టోబర్ 26: భీమ్గల్ పట్టణానికి చెందిన ఓ వ్యాపారి సుమారు 7కోట్ల రూపాయల అప్పులను ఎగనామం పెట్టి పరారవడమే కాకుండా, రుణదాతలకు ఐ.పీ నోటీసులు పంపించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఉదంతం భీమ్గల్ పట్టణంలో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.
కామారెడ్డి, అక్టోబర్ 26: కామారెడ్డి జిల్లాకేంద్రంలో సిఎస్ఐ చర్చిమైదానంలో సెప్టెంబర్ 26వ తేది హత్యకు గురైన చెత్త ఏరుకునే సాయి అనే వ్యక్తి హత్య కేసులో ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరిలించినట్లు కామారెడ్డి డిఎస్పీ లక్ష్మీనారాయణ చెప్పారు.
ఉట్నూరు, అక్టోబర్ 26: స్థానిక ఎక్స్రోడ్డులోని చెక్పోస్టువద్ద శుక్రవారం పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేయగా బొలెరో వాహనంలో తరలిస్తున్న రూ. 1.90 లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటుచేయగా ఎక్స్రోడ్డులోని చెక్పోస్టు వద్ద ప్రతిఒక్క వాహనాన్ని తనిఖీ చేపట్టారు.
బెల్లంపల్లి, అక్టోబర్ 26: మంచిర్యాల జిల్లానుండి ఆసిఫాబాద్ జిల్లాకు ట వేరా వాహనంలో రూ. 2 కోట్ల 20లక్షలను శుక్రవారం రాత్రి కొంతమంది వ్యక్తులు తరలిస్తుండగా బెల్లలంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని చెక్పోస్టు వద్ద టుటౌన్ పోలీసులు పట్టుకున్నారు.
కరీంనగర్, అక్టోబర్ 26: ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే క్యాట్ఫిష్ను అంతరాష్ట్రాలకు సరఫరా చేస్తుండగా రెండు లారీలతోసహా 12క్వింటాళ్ల క్యాట్ఫిష్ను శుక్రవారం నగర పోలీసులు పట్టుకొని ఏడుగురిని అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ శోభన్కుమార్ కథనం ప్రకారం అంతరాష్ట్రాల కు గత కొంతకాలంగా పెద్ద ఎత్తున క్యాట్ఫిష్ సరఫరా చేస్తున్న 7గురు వ్యక్తులతోపాటు క్యాట్ఫిష్ లారీలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
రాజాపేట, అక్టోబర్ 26: మండల పరిధిలోని బేగంపేట గ్రామానికి చెందిన యువ రైతు నీల మల్లేశం (35) అప్పుల బాధతో శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని తండ్రి నీల లక్ష్మీనర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ నాగిరెడ్డి తెలిపారు.
సి.బెళగల్, అక్టోబర్ 26:సి.బెళగల్ గ్రామానికి చెందిన మహిళా రైతు హరిజన సువార్తమ్మ(45) శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. సువార్తమ్మ, ఆమె భర్త ఈరన్న వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక ఎకరా పొలం ఉండగా మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకుని ఈ ఏడాది పత్తి పంట సాగు చేశారు.