రాష్ట్రీయం

శ్రీవారికి కోటి రూపాయలు విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, డిసెబర్ 3: తిరుమల శ్రీవారికి గురువారం ముంబైకి చెందిన వరుణ్ గ్లోబల్ లిమిటెడ్ సంస్థ అధినేత వరుణ్ జీ కటౌ కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. తిరుమల్లోని డోనార్ సెల్ డిప్యూటీ ఇ ఒ రాజేంద్రుడికి గురువారం ఉదయం 10.30గంటలకు విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. ఈమొత్తాన్ని శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు వినియోగించాలని దాత కోరారు. ఈసందర్భంగా డిప్యూటి ఇ ఒ రాజేంద్రుడు మాట్లాడుతూ దాతలు అందించిన విరాళాన్ని వారి కోరిక మేరకు నిత్యాన్న దాన ట్రస్టుకు వినియోగిస్తామన్నారు. విరాళాన్ని అందజేసేందుకు విచ్చేసిన దాతకు, కుటుంబ సభ్యులకు బస, దర్శన ఏర్పాట్లుకల్పించామన్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించామన్నారు. వీరందరికి దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.