రాష్ట్రీయం

టిప్పర్‌ను ఢీకొట్టిన లారీ ఐదుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు , నవంబర్ 24: పంక్చర్ అయిన టిప్పర్‌కు మరమ్మతులు చేస్తున్న సందర్భంలో వెనుకనుంచి మరో లారీ వెనుకనుంచి ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నెల్లూరు శివారు అల్లిపురం వద్ద మంగళవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో అరవ శివకుమార్ (16), కమటం శశి (19), ఎస్‌కె షారూక్ (17), టిప్పర్ డ్రైవర్ తిరుపతయ్య (43), టిప్పర్ యజమాని నాగేశ్వరరావు (45) అక్కడికక్కడే మృతి చెందగా, మెకానిక్ ఇస్మాయిల్, వెనుక నుండి ఢీకొన్న లారీ డ్రైవర్ గణేష్ సహా పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెనుకనుంచి ఢీకొన్న లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. అతికష్టంపై అతన్ని బయటకు తీసుకువచ్చి వైద్యశాలకు తరలించారు. చనిపోయిన ముగ్గురు స్థానిక ఎన్‌టిఆర్‌నగర్‌కు చెందిన వారు కాగా, లారీ యజమాని నాగేశ్వరరావు, దాని డ్రైవర్ గుంటూరు జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.