రాష్ట్రీయం

ఈతకు వెళ్లి..నలుగురు విద్యార్థులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శోకసంద్రంలో చిన్నారుల కుటుంబాలు

పరకాల, డిసెంబర్ 6: ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూర్‌లో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చెల్పూర్ ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా దగ్గరలో ఉన్న ఊర చెరువులోకి ఈతకు వెళ్లారు. అయితే అంతా ఒకేసారి చెరువులోకి దిగి ఈత కొట్టడానికి ప్రయత్నించగా ప్రదీప్ (12), కె. శంకర్ (10), రమేష్ (10), రమణ (10) అందులోనే మునిగి పోయారు. విషయం తెలియగానే సంఘటన స్థలానికి స్థానికులు, పోలీసులు చేరుకున్నారు. మృతి చెందిన విద్యార్థులను ఒడ్డుపైకి చేర్చారు.
విద్యార్థులు మృతి చెందిన సంఘటన తెలియగానే చిన్నారుల కుటుంబాలు శోకసంద్రంలో ముని గిపోయారు. మృతి చెందిన చిన్నారులపై వారు పడి రోదిస్తున్న సంఘటన పలువురిని కంట తడి పెట్టించాయి. అయితే చెరువులో మట్టిని తీయడంతో లోతు ఏర్పడిందని ఈ దరిమిలా విద్యార్థులు చెరువులోకి దిగి ఈతకు ప్రయత్నిస్తున్న తరుణంలో లోతు ఏర్పడక చెరువులో చిన్నారులు మృతి చెందినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. చెరువులోని బొందలే విద్యార్థుల ప్రాణాలు తీశాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.