స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
*
పంచభూతాల అనాది చక్రం
పంచారే చక్రేపరివర్తమానే తస్మిన్నా తస్థుర్భువనాని విశ్వా
తస్య నాక్షస్తప్యతే భూరి భారః సనాదేవ న శీర్యతే సనాభిః
పంచభూతాలనే ఐదు బండికంటి ఆకులతో అనుసంధనింపబడిన ఇరుసు ఆధారం తిరిగే చక్రం మీదనే సమస్త భువనాలు సంచరిస్తున్నాయి. ఆ చక్రపుటిరుసు ఎప్పటికీ చెడదు. అది బరువుకాదు. చాలా ప్రాచీన కాలం నుంచి ఇరుసుతో ఆ బండియాకులు అనుసంధింపబడి ఉన్నాయి. దానివల్ల ఆ చక్రం చెక్కు చెదరకుండా నడుస్తుంది.
పంచభూతాలనే ఐదు బండి ఆకులతో అనుసంధింపబడిన చక్రం ఈ విశ్వం. వివ్వచక్రభ్రమణం గురించి ఈ మంత్రం ఇలా వివరిస్తూంది. సప్త దిశ ఓ నానాసూర్యాః ఏడుదిక్కులలో అనేక సూర్యులున్నారు అని ఋగ్వేద వచనం. ఒక సూర్యుడున్నది ఒక లోకం. ఏడు దిశలలో అనేక సూర్యులున్నారంటేలోకాలు కూడా ఎనె్నన్నో.
ఆ లోకాల కన్నింటికి ఉపాదానకారణం పృథివ్యాప్ తేజో వాయురాకాశాలనే పంచభూతాలే. కుండమట్టితోనే తయారువుతుంది. కనుక మట్టి కుండకు ఉపాదాన కారణం. మట్టిలేని కుండ ఎక్కడుంటుంది?
అలాగే ఉపాదాన కారణమైన పంచభూతాలు లేని లోకాలెక్కడుంటాయి. అంటేలోకాలన్నీ ఈ పంచభూతాల సమ్మేళనంతో నిర్మింపబడి నడుస్తున్నాయి. ప్రళయకాలంలో లోకాలు లయమైనా తిరిగి ఆ పంచభూతాల సమ్మేళనంతోనే అనగా ఉపాదాన కారణంగా పునర్నిర్మింపబడుతాయి. అవే విశ్వవ్యాప్తమై నడుస్తాయి. కాబట్టి లోకాల నిర్మాణం పునర్నిర్మాణం నిరంతరం సాగే ఒక చక్రభ్రమణం లో పంచభూతాలు సదాస్థిరంగా అనుసంధించబడిన ఐదు విధాలైన బండి కంటి ఆకులు.
ఈ సృష్టి చక్ర భ్రమణాన్ని వేదం పంచారే చక్రే పరివర్తమానే తస్మిన్నా తస్థుర్భువనానిన విశ్వా పంచభూతమయమూ నిరంతర భ్రమణశీలమూ ఐన సకల భువన చక్రం విశ్వమంతా సంచరిస్తూ ఉంది అని కవితాత్మ భాషలో ప్రకటించింది వేదం.
బండి కంటి ఆకులుగా ఉన్న పంచభూతాలు ఇరుసుకు బంధించబడి యుండాలి. దాని దృఢత్వాన్ని వేదం వివరిస్తూ నాక్షస్తవ్యతే న భూరి భారః సనాదేవ స శీర్షతే స నాభిః ఈ చక్రపు టిరుసు ఎన్నడూ చెడదు. బహుభారం వలన విరుగదు. శిథిలం కూడా కాదు అని పేర్కొంది. ఎందుకంటే ఇరుసునకు పంచభూతాలు బండి కంటి ఆకులుగా తాత్కాలికంగా అనుసంధింపబడినవి కావు. ఆ ఇరుసు ఏది? భగవంతుడే ఆ చక్రానికి ఇరుసు అందుకే ఆ భగవన్నాభి తప్తం కాదు. శిథిలం కాదు. చెక్కు చెదరదు. రాత్రి పంచభూతాలు అనే బండి కంటే ఆకులు గల భువనం చక్రరూపంగా భ్రమణం సాగిస్తూనే ఉంటుంది.
ఆనందమయ దాంపత్యం
సూర్యో దేవీ ముషసం రోచమానాం మర్యో న యోషామభ్యేతి పశ్చాత్
యత్రానరో దేవయంతో యుగాని వితస్వతే ప్రతి భద్రాయ భద్రమ్

తన ఎడల ప్రసన్నత గవ వనిత వెంట పురుషుడు వెళ్లే విధంగా సూర్యుడు ఉషాదేవి వెంట వెళుతున్నాడు. సుఖాభిలాషియై మనిషి శ్రేష్ఠతకు ప్రతి రూపమైన సమాన గుణ కర్మ స్వభావాలు కలిగిన స్ర్తి పురుష యుగళానే్న కల్పించుకుంటున్నాడు.

సంస్కృత సాహిత్యంలో అవిభిద్య నివాకృతం తమః ప్రభయా నాంశుమతా ప్యుదీయతే రాత్రి కల్పించిన గాఢాంధకారమైన ప్రభాత కాంతులతో తొలగించకుండటా సూర్యుడు కూడా ఉదయించడు. ఈ భావం వేదంలోని సూర్యో దేవీ ముషసం ... అభ్యేతి ప్రకాశమయమైన ఉషస్సు వెనుకే సూర్యుడు ఉదయించును. అను వేదావాక్యార్థం నుండి గ్రహింపబడింది. ఉషస్సు ఉదయించిన వెనుకనే ఉదయించే సూర్యుడికి ఆయన భార్యను అనుసరించే భర్త అనుకూల్యతకు ప్రతీకగా వేదం గ్రహించింది. మనువు కూడా ఈ భావానే్న గ్రహించి మరింత రమణీయంగా చెప్పాడు.
స్ర్తి పురుషుణ్ణి ఇష్టపడకుంటే అతన్ని ఆమె సంతోషరచదు. పురుషుడు సంతోషపడకుంటే సంతానాపేక్షయే సంభవింపదు.స్ర్తి సంతోషంతో ఉంటే ఆమె వంశమంతా సంతోషంతో ఉంటుంది. ఆమెకు సంతోషం లేకుంటే వంశమంతా దుఃఖ పూరితంగా ఉంటుంది.
వేదం రోచమానాయోషా ప్రసన్నురాలయిన స్ర్తికి అనుకూలంగా ప్రవర్తించే పురుషుడు అంటే పురుషుని ప్రవృత్తిని ప్రస్తావించగా మనువు రోచమానా స్ర్తి ప్రపన్నురాలయిన స్ర్తి కారణంగా వంశమంతా సంతోషంగా ఉంటుందని పేర్కొన్నాడు. స్ర్తి పురుషుణ్ణి అభిమానించాలి. మరియు పురుషుడు అంటే పురుషుని ప్రవృత్తిని ప్రస్తావించగా పురుషుడు ప్రసన్నురాలైన స్ర్తీని అనుసరించాలి. మనువు రోచమానా స్ర్తి ప్రసన్నురాలైన స్ర్తి కారణంగా వంశమంతా సంతోషంగా ఉంటుందని పేర్కొన్నాడు. అది ఎలా సంభవమవుతుందో కూడా వేదం యుగాని విశ్వన్వతే ప్రతి భద్రాయ భద్రమ్ సమానమైన గుణాలు, స్వభావాలు, కర్మలు స్ర్తిపురుషుల మధ్య సమానంగా జత కూడినప్పుడే సుఖ దాంపత్యం సంభవిస్తుంది అని సూచించింది.
ఈ సూచన సా ర్వకాలికమైనది. సార్వజనీనమైనది. ఇది విస్మరింపబడి దంపతులుగా స్ర్తిపురుషులు జోడీలు కూర్చబడవచ్చు. కానీ ఆ జోడీలు ప్రతి భధ్రాయ భద్రమ్ స్ర్తి పురుషుల మధ్యగల శ్రేష్ఠతల సమానత్వాన్ని అనుసరించి కూర్చబడినవై యున్నప్పుడే వారి దాంపత్య జీవితం సుఖమయమవుతుంది. అంటే శ్రేష్ఠత, కర్మ స్వభావం గల సంస్కారం వయస్సు ఇలా అనేకాంశాల ఆశ్రయించి ఉంటుంది. ఈ వేదార్థమే ఈడూ జోడూ చూడాలన్న నానుడిగా స్థిరబడింది. అలా చూడబడక జత గూర్చబడిన దంపతులను గూర్చి కాకి ముక్కుకు దొండపండు అన్న ఈసపింపు తెలుగునాట వ్యవహారంలోకి వచ్చింది. వివాహ వ్యవస్థలో స్ర్తిపురుషుల ఈడు జోడుతనాన్ని మరియు దంపతులుగా వారి ప్రేమానురాగ అనుకూల్య దాంపత్య జీవితాన్ని గురించి వేలయేండ్లకు పూర్వమే ప్రస్తావించిన వేదోపదేశాన్ని ఆధునిక సమాజం నేడికీ పెడ చెవిన పెట్టుకుంటుంది. వేదాన్ని అనుసరించకుండా ఎవరికి తోచినట్టు వారు వ్యవహరిస్తున్నారు కనుకనే వివాహవ్యవస్థ నేడు బీటలు బారుతున్నది. నాడు వివాహ వ్యవస్థలో జాతకాలు చూసో లేక పెద్దల అనుభవ సారంతో కుదర్చిన జంటలకు వివాహం చేసేవారు కనుక వారు వారికి పెట్టిన కట్టుబాట్లను, లేదా సంప్రదాయాలను ఆచరిస్తున్నామనుకునో లేక కట్టుబడి ఉండాలన్న నియమంతోనో వివాహ వ్యవస్థను పదిలంగా కాపాడేవారు. దానివల్ల వారి వంశం అంతా చాలా సంతోషంగా గడిపేవారు. వారి వల్ల ఉత్పన్నమైన తరం కూడా వారి బాటలోనే నడిచి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేది.

ఇంకాఉంది