సబ్ ఫీచర్

నరక చతుర్దశి ప్రాశస్త్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపావళి సంబంధ కథల్లో నరకాసుర వధ ఇతివృత్తం ప్రముఖమైనది. ఇతడు వరాహావతార కాలంలో విష్ణుమూర్తికి, భూదేవికి జన్మించాడు. ఆ కాలంలో భూదేవి జనక మహారాజుకు తన కుమారుని పెంపకం బాధ్యతను అప్పగించి వెళ్లిపోయింది. అపుడతడి పేరు భౌముడు. ఇతడి అకృత్యాలకు విసిగి వేసారిన జనకుడు భౌముడిని తీసుకెళ్లమని భూదేవికి చెప్పాడు. ఆమె విష్ణుమూర్తిని ప్రార్థించింది. ఆయన భారతదేశపుఈశాన్య ప్రాంతంలో అసమ (అస్సాం) ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఏర్పరచి, భౌముణ్ణి పట్ట్భాషిక్తుడిని చేశాడు. బలగర్వితుడైన భౌముడు నరులను హింసిస్తూ పాలన చేయడంవల్ల నరకాసురుడు అని పేరు పొందాడు. అతని రాజధాని పేరు ప్రాగ్జోతిషపురం. అంటే తూర్పున వెలిగే నరకమని అర్థము. ప్రజల ప్రార్థన మేరకు ధర్మసంస్థాపనకై సత్యభామను తీసుకుని శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చతుర్దశి రోజున చేశాడు.
చతుర్దశ్యాం తు యేదీవాన్ నరకాయ దదంతిచ
తేషాం పితృగణాస్సత్వా నరకాన్ స్వర్గ మాప్నుయః
నరక చతుర్దశి రోజున చేయాల్సింది- మరణించి పితృలోకాలకు వెళ్లిన మన పెద్దలను తలచుకొని, ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క దీపాన్ని మనింట్లో వెలిగించడం. నూనె పోసి వెలగించినదానినే దీపం అంటారు. పెట్టిన దీపాలను పై శ్లోకం పఠిస్తూదానం చేయాలి. ‘పితృలోకాల్లో వున్న మా పూర్వీకులందరికీ (ఈ ఒక దీపం) ఒక్కొక్కరికి ఈ దీపాలు వెలుగు చూపుతూ వారందర్నీ స్వర్గం చేరుకునేలా చేయుగాక!’ అని ఆకాంక్షించడం, ఇలా ఇవ్వడంలోని భావం.
నరక శబ్దానికి దుర్గతి అని కూడా అర్థం వుంది. అనగా జీవులు తాము చేసిన పాపాలకు తగిన శిక్ష పొందే చోటు. యమలోకంలో 84 లక్షల నరకాలు ఉన్నాయట. వాటిలో మిక్కిలి భయంకరములైన నరకాలు 27 ఉన్నట్లు పురాణాల్లో చెప్పబడింది. అవే రౌరవాది నరకాలు. నరకానికి అధిపతి యముడు. కనుక నరక చతుర్దశినాడు యమప్రీతికై పూజాదులు నిర్వహించి దీపాలను వెలిగించాలట. ఇలా చేస్తే పితృదేవతలు నరక విముక్తులై స్వర్గానికి పోతారట.
నరక చతుర్దశి నాడు తలంటుకోవడంలో ఒక విశిష్టత ఉంది.
‘తైతే లక్ష్మీర్జతే గంగా దీపారళ్వాశ్చతుర్దశీమ్’ అని-
కావేరీ మహత్మ్యంలో చెప్పినట్లుగా నరకచతుర్దశినాడు అభ్యంగన స్నానం సమస్త మంగళములను ఆహ్వానించడమే అని చెప్పబడింది. ఆ రోజు సూర్యోదయానికి పూర్వమే పవిత్ర స్నానాన్ని ఆచరిస్తే శరీరానికి దివ్యశక్తి కలుగుతుందంటారు. నరక చతుర్దశి రోజు, లోకాన్ని పాలించే లక్ష్మీదేవి తైలంలోనూ, గంగ నీటిలోనూ ఆవేశించి ఉంటాయని పద్మపురాణం చెబుతోంది.
భారత స్ర్తి సంప్రదాయం ఎంత గొప్పదంటే లోక కంటకుడైతే తన పుత్రుడని లెక్కచేయకుండా వధించవలసిందే అని చెప్పేటంత. అందుకే పుత్రుని బాధను భరించలేని భూదేవి తనభర్తతో మొరపెట్టుకుని నరకుణ్ణి వధించేసింది. నరకచతుర్దశి నాటి సాయంత్రం కనీసం ఐదు ప్రదేశాల్లో దీపాలు ఉంచాలి. ఇంటి దీపం, ధాన్యపుకొట్టు, రావిచెట్టు మొదట, వంటిల్లు, బావి దగ్గర దీపాలు వెలగించాలి. ఉత్తరాదిన కొందరు నాలుగు వీధుల కూడళ్లలో కూడా దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాల దర్శనంవల్ల నరక తిమిరం ఉండదు.
క్షుతిపా సామలాం జ్యేష్ఠామ లక్ష్మీం, నాశయామ్యహమ్
అభూతిమ సమృద్ధించ సర్వాం నిర్గుదమే గృహాత్
ఆకలి దప్పులతో కృశించే దైవ జ్యేష్ఠాదేవిని నేను నాశనం చేస్తాను. నా గృహం నుండి అభాగ్యాన్ని తొలగించి అనుగ్రహించు అని లక్ష్మీదేవిని నరకచతుర్దశినాడు ప్రార్థించాలి. గుజరాతీలు నరక చతుర్దశిని కాలచేదశ్ అంటారు. చివరగా దుష్ట్భావనలను, దుష్ట ఆలోచనలను కృష్ణ్భక్తి అనే ఆయుధంతో ఖండింపజేసి, జీవుడు భగవద్దర్శన ప్రాప్తితో ఆనందించాలి అనేది నరకచతుర్దశిలోని అంతరార్థం.

- కె.రామ్మోహన్‌రావు 9441435912