రాష్ట్రీయం

ఎల్‌ఇడి బల్బుల పంపిణీలో ఏపి ప్రపంచ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా కోటి ఎల్‌ఇడి బల్బులను పంపిణీ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. శుక్రవారం సాయంత్రానికి ఎపిలో కోటి బల్బుల పంపిణీ పూర్తయినట్లు ఆ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఇందుకు కేంద్ర బొగ్గు, విద్యుత్ శాఖల మంత్రి పియూష్ గోయల్ ఎపి సిఎం చంద్రబాబునాయుడును అభినందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, విద్యుత్ శాఖ కార్యదర్శి అజయ్ జైన్‌లు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ రావడం వల్ల ఈ రికార్డు దక్కింది. దీంతో రికార్డు స్థాయిలో కోటి బల్బులను పంపిణీ చేయడం పట్ల సిఎం చంద్రబాబు కూడా ఆయా విభాగాల అధికారులు, సిబ్బందిని అభినందించారు. వాస్తవానికి ఈ క్రెడిట్ అంతా ప్రజలకు దక్కుతుందని, వారంతా విద్యుత్ పొదుపు చర్యలకు సహకరించడం వల్లే కోటి బల్బుల పంపిణీ సాధ్యమైందని విద్యుత్ శాఖ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.