రాష్ట్రీయం

రాష్ట్రావతరణ వేడుకలకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా జూన్ 2వ తేదీన హెచ్‌ఐసిసిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఇది వరకే ఖరారు అయిన హెచ్‌ఐసిసిలో జరిగే కార్యక్రమానికి గవర్నర్‌ను అధ్యక్షత వహించాల్సిందిగా మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి ఆహ్వాన పత్రాన్ని ఈ సందర్భంగా అందజేసినట్టు అధికార వర్గాల సమాచారం. ఇలా ఉండగా రాజ్యసభకు రాష్ట్రం నుంచి ఖాళీ అయిన స్థానాలకు జరుగబోయే ఎన్నికలకు కాంగ్రెస్ పోటీ చేయనని ప్రకటించడంతో తమ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు ఏకగ్రీవం కానున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. రాష్ట్ర అవతరణ వేడుకలను రాష్టవ్య్రాప్తంగా ఘనంగా నిర్వహించడానికి చేపట్టే వివిధ కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి గవర్నర్‌కు వివరించినట్టు తెలిసింది.