రాష్ట్రీయం
ముగిసిన పైడితల్లి సిరిమానోత్సవం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 17 October 2019
విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 16: విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి జాతర మహోత్సవాలు విజయవంతంగా ముగిసినందుకు జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. మంగళవారం సాయంత్రంతో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా ముగియడం, ఏర్పాట్లలో ఎక్కడా ఎటువంటి పొరపాటూ దొర్లకుండా ప్రశాంతంగా భక్తజనం తమ మొక్కులు చెల్లించుకోవడంతో అన్ని ప్రభుత్వ శాఖలూ సంతృప్తి వ్యక్తం చేశాయి. ఏటా సిరిమానోత్సవాన్ని తిలకించడానికి వచ్చే భక్తజనం పెరుగుతుండడం అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తంగా ఉండేలా చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే మున్సిపల్, దేవాదాయ, పోలీస్ యంత్రాంగాలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించడంతో భక్తులు కూడా ప్రశాంతంగా తమ ఇష్టదైవమైన అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకున్నారు.