రాష్ట్రీయం

జాతీయ సమగ్రతకు నడుం బిగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: జాతీయ సమగ్రతకు యువత నడుం బిగించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయజెండాను పవన్ ఎగురవేశారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ భారతదేశ ప్రజలను ఏకం చేసేవి రెండే పండుగలని, ఒకటి ఆగస్టు 15, మరొకటి గణతంత్ర దినోత్సవమన్నారు. దేశం కోసం ఏమీ ఆశించకుండా నిలబడ్డ పార్టీలు, వ్యక్తులు ఉన్నారని రేపటి తరానికి చెప్పడమే తమ లక్ష్యమన్నారు. ఓటమిపాలైన ఏ పార్టీ అయినా చిగురుటాకులా వణికిపోతుందని, అయితే జనసేన ఎన్ని ఓడిదుడుకులు ఎదురైనా ప్రజల పక్షాన నిలబడుతుందన్నారు. దేశం కోసం ఎందరో త్యాగధనులు ప్రాణాలు అర్పించారని, వారి చరిత్ర తెలియకపోవడం వల్లనే కొందరు రాజకీయ నేతలు అవినీతి, అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం విదేశీయులు మనల్ని ఇబ్బందులకు గురిచేస్తే మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నామని, అయితే నేడు సొంత ప్రజలనే ఎమ్మెల్యేలు వేధిస్తున్నారని ఇది సరి కాదన్నారు.