రాష్ట్రీయం

రాజ్‌భవన్‌లో ఘనంగా ఎట్ హోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంప్రదాయంగా నిర్వహించే ఎట్ హోం (తేనేటి విందు) కార్యక్రమాన్ని నగరంలోని రాజ్‌భవన్ లాన్స్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ దంపతులు ఏర్పాటు చేసిన విందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్ షరీఫ్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతం సవాంగ్, మంత్రులు పేర్ని నాని, కన్నబాబు, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, గవర్నర్ సెక్రటరీ ఎంకే మీనా సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. తేనేటి విందుకు హాజరైన ప్రముఖుల వద్దకు గవర్నర్ స్వయంగా వెళ్లి పలకరించారు.

చిత్రం...విజయవాడ రాజ్‌భవన్ లాన్స్‌లో గురువారం నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమంలో గవర్నర్‌కు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్