రాష్ట్రీయం

తండ్రి సహకరించాడు... బాలుడు అత్యాచారం చేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు, నవంబర్ 29: చిత్తూరు జిల్లా సత్యవేడు మండల పరిధిలోని చెరివి గిరిజన కాలనీకి చెందిన 13 ఏళ్ల బాలికపై అదే మండలం రామచంద్రాపురం గిరిజన గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు తమకు ఫిర్యాదు అందిందని ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు. బాలిక ఒంటరిగా ఇంటిలో ఉన్న సమయంలో రామచంద్రాపురం గిరిజన కాలనీకి చెందిన బాలుడు, బాలుడితో పాటు తండ్రి, చిన్నాన్నలు రెండు ద్విచక్ర వాహనాలలో వచ్చి ఈనెల 17వ తేదీన బలవంతంగా బాలికను తీసుకెళ్లారన్నారు. అక్కడ నుంచి తమిళనాడు ఆరంబాకం సమీపంలోని చెల్లాతమ్మ గిరిజన కాలనీలోని ఓ ఇంట్లో నిర్బంధించి 10 రోజులపాటు తనపై అత్యాచారం చేసి తనను సత్యవేడు సమీపంలో వదిలిపెట్టారని బాలిక తెలిపిందన్నారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు సర్పంచ్ రామయ్యతో కలసి తమకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ సంఘటనపై విచారణ జరిపి కేసులో బాలుడికి సహకరించిన తండ్రి, చిన్నాన్నపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.