రాష్ట్రీయం

పరశురామావతారంలో భద్రాద్రి రామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్: భద్రాచలం రామాలయంలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాల్లో బుధవారం స్వామివారు పరశురామావతారంలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. ఈ రూపంలో ఉన్న స్వామికి తొలుత ఆలయంలో పూజలు చేసి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చి అధ్యయనోత్సవ వేదిక వద్ద ఆసీనులను చేశారు. అక్కడ స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. దుర్మార్గులైన రాజులను ఇరవై ఒక్కమారు దండెత్తి పరశురాముడు సంహరించాడని, ఈ అవతార దర్శనం చేసుకుంటే శుక్ర గ్రహ బాధలు తొలగుతాయని వైదిక పెద్దలు సుభాషించారు. అనంతరం స్వామి తిరువీధి సేవకు బయలుదేరగా ప్రతి ఇంటి ముందు కల్లాపి చల్లి రంగవల్లులు తీర్చిదిద్ది రా రమ్మని స్వామిని స్వాగతించారు. గురువారం స్వామి రామావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
'చిత్రం... పరశురామావతారంలో భద్రాద్రి రామయ్య