రాష్ట్రీయం

భృంగి వాహనంపై ఆది దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఫిబ్రవరి 15: శ్రీశైలం మహాక్షేత్రంలో జరుగుతున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఆది దంపతులు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపారాధనలు, పంచావరణార్చనలు, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు. అందంగా అలంకరించిన స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి మండపం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భృంగివాహనంపై ఆశీనులైన ఆది దంపతులను ఆలయ మాడావీధుల్లో ఊరేగించారు. గ్రామోత్సవం ముందుభాగంలో కళాకారులు ప్రదర్శించిన కోలాటం, చెక్క్భజనలు, రాజభటుల వేషాలు, పగటివేషాలు, బుట్టబొమ్మలు తదితర కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవార్లను దర్శించుకున్నారు. హరహర మహాదేవ శంభోశంకర అంటూ భక్తులు చేసిన నినాదాలతో శ్రీగిరి మారుమోగింది.

*చిత్రం... శ్రీశైలం మహాక్షేత్రంలో జరుగుతున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శనివారం రాత్రి భృంగి వాహనంపై గ్రామోత్సవం