రాష్ట్రీయం

మేయర్ దంపతుల హత్యకేసులో మరో ముగ్గురు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో నిందితుడు లొంగుబాటు
చిత్తూరు, నవంబర్ 24: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసుతో సంబంధం ఉందన్న అభియోగంపై మరో ముగ్గుర్ని మంగళవారం చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు మురుగ టూ టౌన్ పోలీస్‌స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. అయితే దీనిని పోలీసులు ధ్రువీకరించలేదు. ఇదిలా ఉండగా నిందితుల అరెస్టుకు సంబంధించి జిల్లా ఎస్పీ జి శ్రీనివాస్ పోలీస్ అతిథిభవనంలో విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి వివరించారు. మేయర్ దంపతుల హత్య కేసులో ఇప్పటివరకు 11మంది నిందితులుగా తేలారని, ఇందులో మరికొంతమందికి కూడా సంబంధం ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్ అలియాస్ ముళబాగల్ వెంకటేష్ (51)ను అరెస్టు చేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే సికె బాబుపై జరిగిన దాడికి సంబంధించి వెంకటాచలపతి జైలుజీవితం అనుభవించిన తర్వాత చింటూకు దగ్గరయ్యాడన్నారు. చింటూ ద్వారా మోహన్ వద్దనుంచి చాలాసార్లు డబ్బుతీసుకున్నాడన్నారు. అయితే ఇటీవల రెండు లక్షలు అడిగితే ఇవ్వకపోవడంతో చింటూను అడిగి తీసుకున్నాడన్నారు. ఈ క్రమంలో చింటూ కార్యకలాపాల్లో భాగస్వాములు అవుతూ ఈ జంట హత్యకేసులో కీలకపాత్ర పోషించాడన్నారు. ఈ హత్యలకు సంబంధించి నిందితులుగా ఉన్న 11మందిపైనా చిత్తూరు వన్‌టౌన్‌లో కేసు నమోదు చేశామన్నారు. ఇదిలావుండగా దీపావళిరోజునే హత్యచేయాలని పథకం రచించారని అప్పుడు వీలుకాకపోవడంతో ఈనెల 17న అమలుపరిచారని అన్నారు.