కృష్ణ

రైతుల ప్రయోజనాల కోసం కృషిచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: దివి వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్‌గా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహరావు బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నరసింహరావు మాట్లాడుతూ రైతాంగ ప్రయోజనాలకు తన వంతు కృషి చేస్తానన్నారు. 2005-06 సంవత్సరంలో తాను రైతుల కోసం పోరాటం చేసి పంట కాలువల అభివృద్ధికి రూ.కోటి 50లక్షలు నిధులు వచ్చేలా చేశానన్నారు. రానున్న కాలంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ సహకారంతో పంట కాలువను పూర్తి స్థాయిలో అభివృద్ధిపర్చి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానన్నారు. కార్యదర్శి ఆనంద్ నూతన కార్యవర్గంతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పృధ్విరాజ్, నలుకుర్తి సురేష్, సింహాద్రి వెంకటేశ్వరరావు, రేపల్లె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.