రాష్ట్రీయం
అంబేద్కర్కు జగన్ నివాళి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 7 December 2015
హైదరాబాద్, డిసెంబర్ 6: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు పునరంకితం కావాలని వైకాపా అధ్యక్షులు, ఆంధ్రా అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యాలయం లోటస్పాండ్లో జరిగిన అంబేద్కర్ 60వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ వల్లనే దేశంలో దళితులు, మైనార్టీలు, అణగారిన వర్గాలు, మహిళలకు సంపూర్ణమైన హక్కులు లభించాయన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు నల్లా సూర్యప్రకాశరావు, విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.