రాష్ట్రీయం

మేయర్ దంపతుల హత్య కేసులో మరో ముగ్గురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

0.22 రివాల్వర్, 16 బుల్లెట్లు, ఒక బురఖా స్వాధీనం
* హంతకులు ఉపయోగించిన రెండు కార్లు సీజ్

చిత్తూరు, డిసెంబర్ 7: చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ల హత్య కేసుకు సంబంధించి మరో ముగ్గురు నిందితులను చిత్తూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి అరెస్టయిన వారి సంఖ్య 17కు చేరింది. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూకు తుపాకులు, బుల్లెట్లు సమకూర్చిన చిత్తూరు కయినికట్టు వీధికి చెందిన రజనీకాంత్ (38), చిత్తూరు నగరానికే చెందిన నరేంద్రబాబు (48), చింతామణికి చెందిన శ్రీనివాస ఆచారి (75)ని పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్దనుంచి ఒక 0.22 రివాల్వర్, 16 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మేయర్ దంపతుల హత్యానంతరం చింటూ ఆయన అనుచరులు వినియోగించారని భావిస్తున్న ఒక నలుపు రంగు స్విఫ్ట్ కారు, మరో డస్టర్ కారు, ఒక బురఖాను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను సోమవారం జిల్లా ఎస్పీ జి శ్రీనివాస్ స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో విలేఖరుల ముందు హాజరుపరచి వివరాలను వెల్లడించారు.