రాష్ట్రీయం

వరంగల్ ప్రజలకు రుణపడి ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్
వరంగల్, నవంబర్ 24: వరంగల్ ప్రజలకు రుణపడి ఉంటానని వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన పసునూరి దయాకర్ అన్నారు. మంగళవారం ఎన్నికల ఫలితాల అనంతరం కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత 17నెలల సిఎం కెసిఆర్ పాలనపై ప్రజలు సంతోషంగా ఉందనడానికి తన గెలు పే ఒక నిదర్శనమన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో తనను ప్రజలు గెలిపించడంతో తనపై మరింత భారం పెరిగిందని అన్నారు. ఒక చట్టసభల్లోకి సామాన్య కార్యకర్తను పంపిన ఘనత కెసిఆర్‌దేనని అన్నారు. కేంద్ర నిధులతో వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు రాజకీయ జీవితం ప్రసాధించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. బంగారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ సాధించుకుంటామన్నారు.