సబ్ ఫీచర్

అమ్మకోసం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ ఆఖరికోర్కె తీర్చేందుకు ఓ తనయుడు కృష్ణా పుష్కరాలను సద్వినియోగం చేసుకున్న సంఘటన ఇది. హైదరాబాద్‌కు చెందిన కేటరర్ పెండ్యాల శేషసాయి వరప్రసాద్ మట్టపల్లికి వచ్చే పుష్కర యాత్రికులకు ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. తనతల్లి మరణించే ముందు మాట్లాడుతూ పేదలకు, అవసరం ఉన్నవారికి అన్నదానం చేయాలని కోరిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెబుతున్నారు. మట్టపల్లి క్షేత్రానికి వచ్చే భక్తులకు, పదిరోజులపాటు, దాదాపు 40వేల మందికి 12 లక్షల రూపాయల వ్యయంతో అన్నదానం చేస్తున్నానని, ఇది ఎంతో తృప్తినిస్తోందని అంటున్నారు. స్థానిక ఆలయ బ్రాహ్మణ నిత్యాన్నదాన సంఘం సూచన మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెబుతున్నారు. భక్తులకు దగ్గరుండి స్వయంగా వడ్డిస్తూ ఆకలి తీరుస్తున్నారు.

-ఆంధ్రభూమి విలేఖరి, మఠంపల్లి