రాష్ట్రీయం

మూడేళ్లలో ఎయిమ్స్‌ పూర్తి : కేంద్ర మంత్రి నడ్డా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : మూడేళ్లలో మంగళగిరిలో ఎయిమ్స్‌ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి జేపీ.నడ్డా తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్‌ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నడ్డా ప్రసంగించారు. 193 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,618 కోట్ల పెట్టుబడితో ఎయిమ్స్‌ నిర్మిస్తామని చెప్పారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ జీవనశైలిలో మార్పుల కారణంగా అసాధారణ జబ్బులు వస్తున్నాయన్నారు.