S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Others
సృష్టి మొత్తం అనంతమైన చైతన్యంతో నిండి వుంది. చైతన్య శక్తికి సజీవ ఉదాహరణ ‘మనిషి’. మనిషి శరీరాన్ని మన ‘్భమాత’తో పోల్చవచ్చు. భూమి ఒక ప్లానెట్. ప్రతి మనిషినీ ఒక ప్లానెట్గా భావిస్తే మనిషి శరీర నిర్మాణాన్ని ‘‘విధాత’’ ఎంత గొప్పగా తీర్చిదిద్దాడో అర్థం అవుతుంది. సృష్టికర్తకు ఇలా మనిషిని తీర్చిదిద్దడానికి ఎన్ని వేల సంవత్సరాలైనా పట్టి వుండవచ్చుననిపిస్తుంది.
‘సందేహమే’ సగం సమస్య అంటాడు ఓ ప్రముఖ మానసిక శాస్తవ్రేత్త. అసలు సమస్య కానిదానిని ‘సమస్య’ అనుకొని భయాన్ని పెంచుకోవడం, ప్రతి చిన్న సమస్యనూ భూతద్దంలోంచి చూసి భీతావహులు కావడం సర్వసాధారణంగా సామన్య మానవులంతా నిత్యం చేసే పని!
కాల ప్రమాణంలో చాంద్రమానాన్ని అనుసరించి రేండేళ్ళకో, మూడేళ్ళకో ఒకసారి ఒక నెల అధికంగా వస్తుంది. దీనినే పురుషోత్తమ (శూన్య లేదా మల) మాసం అంటారు. అధికమాసం దైవారాధనకు, భగవన్మామ స్మరణకు, నదీ స్నానానికి, దీపాది దానాలకు అత్యంత పవిత్రమైనదిగా భావించ బడుతుంది.
దేవుని మాటలను సంతోషంగా ధ్యానించినట్లయితే మన హృదయ వాంఛ తీరుతుంది. బైబిల్ గ్రంథాన్ని ఆనందంతో దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును.
సత్యాన్ని తెలుసుకోవాలనే కాంక్ష మానవునికి ఈ నాటిది కాదు. ఇది అనాది. అంతం లేనిది. కొనసాగుతూనే వుంటుంది. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి మనిషి చేసే ప్రయత్నాలలో, వెదికే మార్గాలలో, చేసే పరిశోధనలలో, విధానాలలోనే భేదమంతా! మార్గాలు వేరైనా సత్యమొక్కటే.
ముస్లిం సోదరులకు పరమ పవిత్రమైన రంజాన్ నెల సందర్భంగా నెల రోజులపాటు నిర్వహించనున్న దీక్షలు మే 17నుండి ప్రారంభించి, జూన్ 16న రంజాన్ పండుగ వరకు కొనసాగనున్నాయి. దివ్య ఖురాన్ అవతరించిన రంజాన్ నెలలో పరమ పవిత్రంగా ప్రత్యేక ప్రార్థనలతో, ఉపవాసదీక్షా కంకణులైన ధార్మికులు, భక్తిశ్రద్దలతో అన్ని అలవాట్లకు దూరంగా ఉంటూ, నెల రోజుల దీక్షలో నిమగ్నమై ఉంటారు. మహమ్మదీయుల మతానుసారం సంవత్సరంలో 9వ నెల రంజాన్.
‘‘ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది’’- ఇది సనాతన ధర్మసూత్రం. ఏది ధర్మం? ఏది ధర్మం కాదు!! ఇది ఆలోచన. ఓ కొడుకు తన తల్లిదండ్రులపట్ల తన బాధ్యతను నెరవేరిస్తే- అదొక ధర్మం- (ఈ సమయంలో ధర్మం పేరు కర్తవ్యం)
ఓ పంచాయతీలో న్యాయంగా మాట్లాడటం- ధర్మం (న్యాయాన్ని ధర్మశబ్దంలో ఇక్కడ వాడతారు)
‘డాల్టన్ జాన్’ (1766-1884ఎడి) అను ఆంగ్లేయుడు అణు సిద్ధాంతమును కనిపెట్టినట్లు చెబుతున్నారు. లక్షల సంవత్సరముల పూర్వమే గౌతమ మహర్షి తన ‘న్యాయదర్శనమను గ్రంథమునందు’ అణువులే రుూబ్రహ్మాండమందలి చరాచర సృష్టి కంతటికి కారణమని నిరూపించాడు. ఈ అణు స్వరూపమును గురించి మన వేదములు, ఉపనిషత్తులు, ధర్మశాస్తమ్రుల యందు వందల కొలది శ్లోకములు వివరించుచున్నవి.
ఆయువు, విత్తము, ఇంటిగుట్టు, మంత్రం, ఔషధం, సంగమం, దానం, మానము, అవమానం- అనే ఈ తొమ్మిదింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచాల్సినవి.