S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/26/2015 - 05:16

కడప, డిసెంబర్ 25: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చేనెల 2వ తేది నుంచి తిరిగి ప్రారంభంకానున్న జన్మభూమి కార్యక్రమంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకే అధికారులు వెళ్లి అర్జీలు స్వీకరించి, సమస్యలు పరిష్కరించాల్సి ఉంది.

12/26/2015 - 05:21

కంచికచర్ల, డిసెంబర్ 25: జాతీయ రహదారిపై కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం నక్కలంపేట గ్రామ సమీపంలో గురువారం అర్థరాత్రి దాటిన తరువాత ఒంటి గంట సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

12/26/2015 - 05:11

మంగళగిరి, డిసెంబర్ 25: గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమర్రు రోడ్డులో గల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట రోడ్డుపై శుక్రవారం తెల్లవారుఝామున పీకలదాకా మద్యం తాగిన కొందరు యువకుల మధ్య జరిగిన స్ట్రీట్‌ఫైట్‌లో మేకతోటి హేమంత్ (25), కాకర్ల రమేష్ (20) అనే యువకులు హత్యకు గురయ్యారు.

12/26/2015 - 05:10

రాజమండ్రి, డిసెంబర్ 25: గోదావరి డెల్టా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డిసెంబర్ నెలలోనే సీలేరు బైపాస్ జలాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తటం గోదావరి రైతులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గోదావరి డెల్టాలో పూర్తి ఆయకట్టుకు అనుమతినిస్తామని రాష్ట్రప్రభుత్వం భరోసా ఇవ్వటంతో రబీకి సాగుకు సిద్ధమైన రైతులను తాజా పరిణామాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి.

12/26/2015 - 04:48

హైదరాబాద్, డిసెంబర్ 25: బిసి రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు, ఆందోళన చేయాలని బిసి సంఘాలు ప్రయత్నిస్తుండగా, ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే క్రీమీ లేయర్‌ను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జాతీయ బిసి కమీషన్ జస్టిస్ వి ఈశ్వరయ్య ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు.

12/26/2015 - 04:47

హైదరాబాద్, డిసెంబర్ 25: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును, ప్రభుత్వ భూముల లీజు గడువును 33 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాలకు పెంచుతూ ఆమోదించిన బిల్లును తిరస్కరించాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిపిసిసి) అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరారు. ఈ మేరకు రఘువీరా రెడ్డి శుక్రవారం గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు.

12/26/2015 - 04:44

హైదరాబాద్, డిసెంబర్ 25: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపిఎఫ్‌ఓ) కార్యకలాపాలను ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా నిర్వహించేందుకు వీలుగా వాటిని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం ప్రారంభించారు. ఈ రెండింటి వల్ల ఈపిఎఫ్ సమస్యల పరిష్కారం, లబ్దిదారులకు సమాచారం వెంటనే తెలియజేసేందుకు ఈ సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్లు చాలా ఉపయోగపడతాయని అన్నారు.

12/26/2015 - 04:43

హైదరాబాద్, డిసెంబర్ 25: తమ పార్టీ జాతీయ నాయకుడు, మాజీ ప్రధాని ఎబి వాజ్‌పేయి స్పూర్తితో పెన్షన్లు, గృహ నిర్మాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శుక్రవారం వాజ్‌పేయి జన్మదినాన్ని పురస్కరించుకుని బిజెపి రాష్ట్ర శాఖ పేదలకు దుస్తులు, వికలాంగులకు త్రిచక్ర వాహనాలను పంపిణీ చేసింది.

12/26/2015 - 04:36

భీమవరం, డిసెంబర్ 25: విభజన తర్వాత రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోక్‌గజపతిరాజు అన్నారు. రెండు రాష్ట్రాల్లో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వాలు ముందుకు రాకపోవడమేకాక భూ సేకరణ, భారీగా నిధుల అవసరం తదితర ఇబ్బందులున్నాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

12/26/2015 - 04:35

హైదరాబాద్, డిసెంబర్ 25: వద్దు వద్దని చెప్పినా అమెరికా చదువులపై ఉత్సాహం పెంచుకుంటున్న భారతీయ విద్యార్ధులు వర్శిటీలకు చేరకుండానే మధ్యలో చిక్కుకుపోతున్నారు. నేరుగా అమెరికా వెళ్లే విమానాల్లో కాకుండా అబుదాబి మీదుగా వెళ్తున్న వారిని అక్కడి విమానాశ్రయాల్లోని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్ధులను అడ్డుకుంటున్నారు.

Pages