-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, మే 23: సిబిఎస్ఇ ఆధ్వర్యంలో నిర్వహించిన టెన్త్ ఫలితాలను ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నారు. పదోతరగతి ఫలితాల కోసం ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ట్రిపుల్ ఐటి యాజమాన్యాలు సహా ఇంటర్లో ప్రవేశానికి కార్పొరేట్ సంస్థలు ఎదురుచూస్తున్నాయి. సిబిఎస్ఇ ఫలితాలు రానిదే ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాదు. 27న ఫలితాలను సిబిఎస్ఇ రిజల్ట్సుడాట్ఎన్ఐసిడాట్ఇన్ అనే వెబ్సైట్లో ఉంచనున్నారు.
తాండూరు, మే 23: టెట్ ‘కీ’ ఓ విద్యార్థినిని కాటేసింది. తక్కువ మార్కులు వస్తాయనే మనస్థాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారకర సంఘటన రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని భవిగి భద్రేశ్వర దేవస్థానం ఆవరణలో నివాసముంటున్న మఠం శే్వత(21) ఈనెల 22న నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు హాజరైంది.
హైదరాబాద్, మే 23: తెల్లకాగితాలపై రాసుకుని క్రయవిక్రయాలు జరిపే భూముల వివాదాలకు మోక్షం లభించనుంది. జూన్ 2నుంచి 10వరకు ఇలాంటి ఒప్పందాలతో కొన్న భూముల రిజిస్ట్రేషన్కు ప్రత్యేకంగా అనుమతిస్తారు. సోమవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పల్లెల్లో తెల్ల కాగితాలపై రాసుకుని భూములను అమ్మకాలు కొనుగోలు చేయడం సర్వసాధారణం.
హైదరాబాద్, మే 23: వచ్చే దసరా నుంచే కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నాయి. సిఎం ముందుగా ప్రకటించినట్టు కొత్త జిల్లాల పేర్లు జూన్ 2న ప్రకటించే అవకాశం లేదు. ముందుగా హైదరాబాద్లో వర్క్షాప్ నిర్వహించి ఆ తరువాతే జిల్లాలను ప్రకటిస్తారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజాసౌకర్యం అంశాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరపాలని నిర్ణయించినట్టు సిఎం కెసిఆర్ ప్రకటించారు.
హైదరాబాద్, మే 23: మెడికల్, డెంటల్ కాలేజీల్లో అడ్మిషన్లకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి త్వరలో ఎమ్సెట్ నిర్వహించనున్నట్టు గతంలో ప్రకటించినా, ఇంకా అందుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ వ్యవహారం మరింత జాప్యమవుతోంది. కేంద్రం జారీ చేయాల్సిన ఆర్డినెన్స్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.
విజయవాడ, మే 23: రాష్ట్ర రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సంస్థలు ముందుకొచ్చాయి. జపాన్కు చెందిన సుమారు 130 మంది పారిశ్రామిక ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విజయవాడలో సమావేశమై అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్ర రాజధాని కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా 33 వేల ఎకరాల భూమిని సేకరించామని చెప్పారు. వినూత్నమైన ఆలోచనలతో ఎపిని రోల్ మోడల్గా తీర్చిదిద్దనున్నామని చెప్పారు.
హైదరాబాద్, మే 23: హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చే ఉద్యోగుల పనిరోజులు ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి టక్కర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల విజ్ఞప్తి పరిగణనలోకి తీసుకుని వెలగపూడిలో నిర్మించే ప్రభుత్వ భవన సముదాయంతోపాటు అమరావతి పరిసరాల్లో పని చేసేందుకు హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు వారంలో ఐదురోజులు మాత్రమే పనిదినాలుగా ఖరారు చేశారు.
విశాఖపట్నం, మే 22: ఇతర పార్టీల నుంచి వచ్చి భారతీయ జనతాపార్టీలో చేరి పబ్బం గడుపుకుంటున్న నేతలు కాంగ్రెస్, వైకాపా కోవర్టులని, వారి విషయంలో బిజెపి అధిష్ఠానం కఠినంగా వ్యవహరించాలని విశాఖ టిడిపి నేతలు ధ్వజమెత్తారు. పార్టీ విశాఖ అర్బన్ జిల్లా మిని మహానాడు నగరంలో ఆదివారం జరిగింది.
విశాఖపట్నం, మే 22: పత్రికా రంగంలో విశేష సేవలు అందించిన సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వర రావుకు విశాఖలోని గంటా నారాయణమ్మ స్మారక ట్రస్టు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందచేసింది. విశాఖలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, మంత్రి కొల్లు రవీంద్ర ఈ అవార్డును ఆందచేశారు.