మరపురాని జ్యోతిలక్ష్మి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఛార్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జ్యోతిలక్ష్మి’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విమర్శనాత్మకంగా పుస్తక రూపంలో మంగళగౌరి రాశారు. ఈ పుస్తకాన్ని నటుడు తనికెళ్ల భరణి బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ, పిహెచ్డి అవార్డు చేసే స్థాయిలో మంగళగౌరి ఈ పుస్తకాన్ని రచించారని, ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ సినిమాలో డైలాగ్స్ విని.. నేను సినిమా చేస్తే అందులో డైలాగ్స్ మీరే రాయాలని పూరి దగ్గర అప్పుడే మాట తీసుకున్నానని, ఆ సినిమా డైలాగ్స్కు నంది అవార్డు కూడా అందుకున్నానని, ఛార్మి కెరీర్లో ‘అనుకోకుండా ఒకరోజు’,‘జ్యోతిలక్ష్మి’ చిత్రాలు ఎప్పటికీ నిలిచిపోతాయని, జ్యోతిలక్ష్మికి సీక్వెల్ చేస్తారేమో అని అన్నారు. ఛార్మి మాట్లాడుతూ, పూరి జగన్నాథ్ ఎంతో ఇన్స్పిరేషషన్తో ఈ సినిమా తీశారని, ఒక పుస్తకంతో మొదలైన ఈ సినిమా పుస్తకంతోనే ముగుస్తుందని చెప్పారు.