అంతర్జాతీయం
హెలికాప్టర్ల కుంభకోణంలో ఐఏఎఫ్ మాజీ చీఫ్ త్యాగి దోషి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 26 April 2016
న్యూఢిల్లీ : భారత వైమానిక దళం మాజీ అధిపతి ఎస్పీ త్యాగికి వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో భారీగా ముడుపులు అందినట్లు ఇటలీ కోర్టు నిర్ధారించింది. భారతీయ అధికారులకు దాదాపు 15 మిలియన్ డాలర్లు ముడుపులు అందినట్లు రుజువైందని స్పష్టం చేసింది. 2010 నాటి అగస్టా వెస్ట్ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంపై విచారణ జరిపి ఇటలీ కోర్టు తీర్పును ఇచ్చింది. అగస్టా వెస్ట్ల్యాండ్కు అనుకూలంగా త్యాగి జోక్యం చేసుకున్నట్లు, అక్రమ నిధుల్లో కొంత వాటా ఆయన పొందినట్లు స్పష్టంగా రుజువైందని పేర్కొంది.