క్రైమ్/లీగల్

మెడికో దారుణ హత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కనిపర్తిలో మెడికో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తుమ్మనపెల్లి తిరుపతి-రమ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తుండగా, చిన్న కుమారుడు వంశీ (22) ఖమ్మం జిల్లా మమత మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి పండుగ కోసం గ్రామానికి వచ్చిన వంశీ శుక్రవారం తిరిగి కాలేజీకి వెళ్తున్నానని కుటుంబ సభ్యులతో చెప్పి వెళ్లాడు. శనివారం వంశీ తండ్రి తిరుపతి వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లగా వంశీ బ్యాగు,
చెప్పులు కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు బావిలో గాలించగా వంశీ మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చిట్యాల సీఐ సాయిరమణ, ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్‌గౌడ్ చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు వంశీని కాళ్లు, చేతులు కట్టి బావిలో పడేసినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సాయిరమణ తెలిపారు. కాగా, గత ఏడాది మానసిక ఆందోళనకు గురైన వంశీ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలిందని, అందుకే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణప్రసాద్‌గౌడ్ తెలిపారు. దర్యాప్తు అనంతరం మిగతా వివరాలు వెల్లడిస్తామని సీఐ సాయిరమణ తెలిపారు.

'చిత్రం... హత్యకు గురైన వంశీ
*ఇన్‌సెట్లో ఫైల్ ఫొటో)